ద్యావుడా.. జగన్‌కు ముద్దుపెట్టిన పీఠాధిపతి.. ఎవరు?

Webdunia
శుక్రవారం, 11 జనవరి 2019 (22:21 IST)
సంకల్ప యాత్ర దిగ్విజయంగా పూర్తయిన సంధర్భంగా తిరుమల శ్రీవారికి మ్రొక్కులు తీర్చుకున్నారు ఎపి ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి. జగన్ పర్యటన రోజే విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందస్వామి కూడా తిరుమలకు వచ్చారు. స్వరూపానందస్వామిని స్వయంగా జగన్ కలిశారు. 
 
అయితే వీరిద్దరు కలిసిన సమయంలో ఆసక్తికర చర్చలు జరిగాయి. ఒక పీఠాధిపతి రాజకీయ నాయకుడి చెవిలో వ్యాఖ్యలు చేయడం.. ఆయనకు ముద్దు పెట్టడం తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. వచ్చే ఎన్నికల్లో నువ్వే కాబోయే సిఎం అంటూ విశాఖ శారదా పీఠాధిపతి జగన్ చెవిలో చెప్పి ముద్దు పెట్టినట్లు వైసిపి నేతలు ప్రచారం చేస్తున్నారు. 
 
ఇప్పటికే కెసిఆర్ విశాఖకు వెళ్ళి స్వరూపానందను కలవడం.. ఆ తరువాత జగన్ వెళ్ళి తిరుమలలో శారదా పీఠాధిపతిని కలవడం స్థానికంగా చర్చనీయాంశంగా మారుతోంది. పీఠాధిపతిగా ఉన్న స్వరూపానంద స్వామి రాజకీయ నేతలతో సన్నిహితంగా ఉండడంతో హిందూ ధార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దేశీ ప్రిన్సెస్‌'లా మెరిసిపోతున్న జాన్వీ కపూర్

Nani: 150 మిలియన్+ వ్యూస్ తో నాని ది ప్యారడైజ్ ఆయా షేర్ సాంగ్

Devi Sri Prasad: ఎల్లమ్మ చేయడానికి స్ఫూర్తిని ఇచ్చిన గ్రామం వెదురుపాక: దేవిశ్రీ ప్రసాద్

Karthi: ఈ ఏడాది చిత్రాల సందడితో 49వ పుట్టినరోజు జరుపుకుంటున్న కార్తి

కెమెరాతో కథ చెప్పాలి, రీ-రికార్డింగ్‌కి కూడా కథలో స్పేస్ ఉండాలి : కెమెరామెన్ రత్నవేలు

తర్వాతి కథనం
Show comments