Webdunia - Bharat's app for daily news and videos

Install App

చేతులెత్తేసిన సుప్రీంకోర్టు... ఆ కోర్టులోనే తేల్చుకోవాలంటూ చిదంబరంకు షాక్

Webdunia
సోమవారం, 26 ఆగస్టు 2019 (14:36 IST)
కాంగ్రెస్ సీనియర్ నేత, ఆర్థిక శాఖ మాజీ మంత్రి పి. చిదంబరంకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. సీబీఐ అరెస్టులో తాము జోక్యం చేసుకోలేమని పేర్కొంది. అదేసమయంలో ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కూడా కోర్టు కొట్టివేసింది. పైగా, కింది కోర్టులోనే తేల్చుకోవాలని సూచన చేసింది. 
 
ఐఎన్ఎక్స్ మీడియా కుంభకోణం కేసులో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. సీబీఐ కోర్టులో బెయిల్ పిటిషన్ వేసుకోవాలని సూచించింది. చిదంబరం ఇప్పటికే అరెస్టు అయినందున ముందస్తు బెయిల్ పిటిషన్ చెల్లదని పేర్కొంది. అయితే, ఆయన అరెస్టు కావడానికి ముందే పిటిషన్ దాఖలు చేశామని చిదంబరం తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. 
 
అరెస్టు తర్వాత దాఖలు చేసిన పిటిషన్ ఇంకా లిస్టు కాలేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. సీబీఐ కస్టడీని సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌పై తర్వాత విచారణ చేపడుతామని కోర్టు స్పష్టం చేసింది. చిదంబరం ఇప్పటికే సీబీఐ కస్టడీలో ఉన్నారు. 
 
మరోవైపు, ఐఎన్‌ఎక్స్ మీడియా కుంభకోణానికి సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నమోదు చేసిన కేసులో చిదంబరానికి సుప్రీంకోర్టు 26వ తేదీ సోమవారం వరకు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ గడువు కూడా సోమవారంతో ముగియనుంది. 

సంబంధిత వార్తలు

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో సుమయా రెడ్డి‌ నటిస్తున్న డియర్ ఉమ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments