Webdunia - Bharat's app for daily news and videos

Install App

చేతులెత్తేసిన సుప్రీంకోర్టు... ఆ కోర్టులోనే తేల్చుకోవాలంటూ చిదంబరంకు షాక్

Webdunia
సోమవారం, 26 ఆగస్టు 2019 (14:36 IST)
కాంగ్రెస్ సీనియర్ నేత, ఆర్థిక శాఖ మాజీ మంత్రి పి. చిదంబరంకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. సీబీఐ అరెస్టులో తాము జోక్యం చేసుకోలేమని పేర్కొంది. అదేసమయంలో ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కూడా కోర్టు కొట్టివేసింది. పైగా, కింది కోర్టులోనే తేల్చుకోవాలని సూచన చేసింది. 
 
ఐఎన్ఎక్స్ మీడియా కుంభకోణం కేసులో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. సీబీఐ కోర్టులో బెయిల్ పిటిషన్ వేసుకోవాలని సూచించింది. చిదంబరం ఇప్పటికే అరెస్టు అయినందున ముందస్తు బెయిల్ పిటిషన్ చెల్లదని పేర్కొంది. అయితే, ఆయన అరెస్టు కావడానికి ముందే పిటిషన్ దాఖలు చేశామని చిదంబరం తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. 
 
అరెస్టు తర్వాత దాఖలు చేసిన పిటిషన్ ఇంకా లిస్టు కాలేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. సీబీఐ కస్టడీని సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌పై తర్వాత విచారణ చేపడుతామని కోర్టు స్పష్టం చేసింది. చిదంబరం ఇప్పటికే సీబీఐ కస్టడీలో ఉన్నారు. 
 
మరోవైపు, ఐఎన్‌ఎక్స్ మీడియా కుంభకోణానికి సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నమోదు చేసిన కేసులో చిదంబరానికి సుప్రీంకోర్టు 26వ తేదీ సోమవారం వరకు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ గడువు కూడా సోమవారంతో ముగియనుంది. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments