Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎస్పీబీని అవమానించారు.. సోషల్ మీడియాలోనూ మీమ్స్ కూడా అదే రకంగా?

Webdunia
శుక్రవారం, 7 డిశెంబరు 2018 (19:00 IST)
ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంను అవమానించారంటూ.. సోషల్ మీడియాలో మీమ్స్ పేలుతున్నాయి. తెలుగులోనే కాకుండా పలు భాషల్లో పాటలు పాడిన ఎస్పీబీని.. అవమానపరిచారని నెటిజన్లు మండిపడుతున్నారు. తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్ నటించి, సంక్రాంతికి విడుదల కాబోతున్న పేట్ట సినిమాలోని మరణ మాస్ సాంగ్‌లో కొన్ని లైన్లు మాత్రమే ఎస్పీబీ పాడించారు. 
 
పాట మొత్తం కాకుండా కొన్ని లైన్లు మాత్రమే పాడించడం ఎస్పీబీని అవమానపరచడమేనని ఆయన ఫ్యాన్స్ సోషల్ మీడియా ద్వారా అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ పాటకి తనతో కొన్ని లైన్లు పాడించారు. అయినప్పటికీ చాలాకాలం తర్వాత రజనీకాంత్‌కు పాడినందు సంతోషంగా వుందని ఎస్పీబీ సంస్కారవంతంగా బదులిచ్చినా.. ఆయన ఫ్యాన్స్ మాత్రం సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్నారు. 
 
పాటల్లో కొత్త పోకడలు మొదలయ్యాక ఎస్పీబీ లాంటి ప్రముఖ గాయకులను పక్కనబెట్టేశారని.. స్టార్ హీరోలు రజనీకాంత్, కమల్ హాసన్ సినిమాల్లో ఎస్పీబీ ఎన్ని పాటలు పాడారో గుర్తు పెట్టుకోవాలని వారు గుర్తు చేస్తున్నారు. కాగా పేట్టా మరణ మాస్ సాంగ్ రిలీజ్ అయ్యాక.. సోషల్ మీడియాలో ఎస్పీబీ పాడిన లైన్స్‌ను సూచిస్తూ కొన్ని మీమ్స్ పేలాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో సీజన్ 3లో పేటీఎం సీఈఓ విజయ్ శేఖర్ శర్మ, తన డబ్బునంతా కపిల్ శర్మకు అప్పగించారా?

Natti kumar: ఫిలిం ఛాంబర్, ఫెడరేషన్ కలిసి సినీ కార్మికులను మోసం చేశారు : నట్టి కుమార్ ఫైర్

Govinda-Sunita divorce: గోవింద- సునీత విడాకులు తీసుకోలేదు.. మేనేజర్

వారం ముందుగానే థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న లిటిల్ హార్ట్స్

సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా.. జటాధర నుంచి దివ్య ఖోస్లా ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments