Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైలు కిందపడి కర్నాటక శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ ఆత్మహత్య!!

Webdunia
మంగళవారం, 29 డిశెంబరు 2020 (08:52 IST)
కర్నాటక రాష్ట్రంలో పెను విషాదం చోటుచేసుకుంది. ఆ రాష్ట్ర శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్, జేడీఎస్ ఎమ్మెల్యే ఎస్.ఎల్.ధర్మెగౌడ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. సోమవారం సాయంత్రం ఇంటి నుంచి బయటకెళ్లిన ధర్మెగౌడ ఆచూకీ ఆ తర్వాత తెలియరాలేదు. దీంతో పోలీసులు,  గన్‌మెన్ ఆయన కోసం గాలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. 
 
ఈ క్రమంలో మంగళవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో చిక్కమగళూరు జిల్లా కదుర్ తాలూకా గుణసాగర్ సమీపంలోని రైల్వే ట్రాక్ పక్కన ఆయన మృతదేహాన్ని గుర్తించారు. దీంతో రైలు కిందపడి ఆయన ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు భావిస్తున్నారు. 
 
అయితే, మృతదేహం పక్కనే ఉన్న ఆత్మహత్య చేసుకున్నట్టు ఓ లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆయన ఆత్మహత్యకు గల కారణం తెలియరాలేదు. కాగా, ఈ నెల 16వ తేదీన శాసనమండలి ఛైర్మన్ కె ప్రతాపచంద్ర శెట్టిపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం సందర్భంగా సభలో రభస జరిగింది. 
 
మండలి సభ్యులు ఒకరినొకరు తోసుకునే వరకు వెళ్లింది. సభాపతి స్థానంలో ఉన్న ధర్మెగౌడను కాంగ్రెస్ సభ్యులు ఛైర్మన్ సీటు నుంచి లాక్కెళ్లిపోయారు. ఈ ఘటన వివాదాస్పదమైంది. ఈ క్రమంలో ఇప్పుడు ధర్మెగౌడ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments