Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అల్లుడుతో అత్త రాసలీలలు... బయటకు తెలియడంతో సూసైడ్!

అల్లుడుతో అత్త రాసలీలలు... బయటకు తెలియడంతో సూసైడ్!
, గురువారం, 24 డిశెంబరు 2020 (15:03 IST)
తెలంగాణ రాష్ట్రంలో ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. వీరిద్దరి మధ్య ఉన్న అక్రమ సంబంధం బయటకు తెలియడంతో మనస్తాపం చెందిన వారు పురుగుల మందు తాగి సూసైడ్ చేసుకున్నారు. ఈ విషాదకర ఘటన తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్‌ అర్బన్‌ జిల్లా దేవునూర్ గ్రామంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, దేవునూరు గ్రామానికి చెందిన మాధవి (35) అనే వివాహితకు అదే గ్రామానికి చెందిన సుమన్ (35) అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. పైగా మాధవికి సుమన్ అల్లుడు వరుస అవుతాడు.

గత కొంతకాలంగా గుట్టుచప్పుడు కాకుండా సాగుతూ వచ్చిన వీరి వ్యవహారం ఇటీవల బట్టబయలైంది. దీంతో నలుగురు నాలుగు విధాలుగా మాట్లాడసాగారు. ఈ మాటలతో మనస్తాపం చెందిన  వారిద్దరూ పెద్దజాలుగుంట వద్ద పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకున్నారు. 
 
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేస్తున్నారు. వీరి ఆత్మహత్యకు వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు ఓ నిర్ణయానికి వచ్చారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అలసట - విపరీతమైన తలనొప్పి - ఆకలి లేకపోవడం.. ఇవి ఉంటే ఖచ్చితంగా స్ట్రెయిన్!