ఆరు యూఎస్ టెక్ దిగ్గజ కంపెనీలకు సీఈవోలుగా భారత సంతతివారే...

Webdunia
మంగళవారం, 30 నవంబరు 2021 (12:24 IST)
విదేశాల్లో భారతీయులతో పాటు భారతీయ సంతతికి చెందిన ప్రతిభావంతులు సత్తా చాటుతున్నారు. ఇప్పటికే అనేక మంది భారత సంతతి వారు అనేక ప్రపంచ దేశాల్లో కీలక బాధ్యతలను నిర్వహిస్తున్నారు. అలాగే, ఇపుడు మరో అంతర్జాతీయ సంస్థకు మరో భారత సంతతికి చెందిన వ్యక్తి అధిపతిగా నియమితులయ్యారు. ఆయన ఎవరో వారు పరాగ్ అనురాగ్.
 
మైక్రోసాఫ్ట్, గూగూల్, అడోబ్, ఐబీఎం, మైక్రాన్, మాస్టర్ కార్డ్ సంస్థలకు భారతీయులు భారత సంతతికి చెందిన వ్యక్తుల సీఈవోలుగా ఉన్నారు. ఈ అంతర్జాతీయ కంపెనీలన్నింటికీ భారత్‌లో పుట్టి పెరిగిన వారే సీఈవోలుగా వ్యవహరిస్తుండటం గమనార్హం. ఇందులో ఆరు అంతర్జాతీయ కంపెనీలు అమెరికాకు చెందిన టెక్ దిగ్గజ కంపెనీలు కావడం గమనార్హం. 
 
మైక్రోసాఫ్ట్‌ సీఈవోగా సత్య నాదెళ్ల, గూగుల్‌ సీఈవోగా సుందర్ పిచ్చాయ్, అడోబ్ సీఈవోగా శాంతను నారాయణ, ఐబీఎం సీఈవోగా అరవింద్ కృష్ణ, మైక్రాన్‌కు సంజయ్ మెహ్రోత్రా, మాస్టర్ కార్డ్‌కు అజయ్ బంగా ఉన్నారు. అయితే, అజయ్ బంగా తన పదవికి రాజీనామా చేశారు. దీంతో మాస్టర్ కార్డ్ అధిపతిగా ప్రస్తుతం మైఖైల్ మిబేచ్ కొనసాగుతున్నారు. తాజాగా ట్విట్టర్ సీఈవోగా పరాగ్ అగర్వాల్ నియమితులయ్యారు. 
 
ఎవరీ పరాగ్ అగర్వాల్?
బాంబే ఐఐటీ, స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన పూర్వ విద్యార్థి. పదేళ్ళ క్రితం ట్విట్టర్‌లో యాడ్స్ ఇంజనీర్‌గా కెరీర్‌ను ప్రారంభించాడు. అప్పటి నుంచి అంచలంచెలుగా ఎదుగుతూ 2017లో సంస్థ టెక్నాలజీ అధిపతిగా పదోన్నతి సాధించారు. ఇపుడు సీఈవోగా ఎన్నికయ్యారు. 
 
గతంలో మైక్రోసాఫ్ట్, యాహూ తదితర సంస్థల్లో పనిచేసిన అనుభవం ఉంది. ట్విట్టర్ సీఈవోగా నియమితులైన తర్వాత పరాగ్ అనురాగ్ స్పందిస్తూ, "ఈ బాధ్యతనాకు రావడం పట్ల గర్వపడుతున్నాు. డోర్సే మార్గదర్శత్వాన్ని కూడా కొనసాగిస్తాను. ఆయన స్నేహానికి కృతజ్ఞతలు" అంటూ పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tharun Bhascker: గాయపడ్డ సింహం గా తరుణ్ భాస్కర్ ఏమి చేశాడు !

నాగార్జున వాయిస్ ఓవర్ తో అనిష్ చిత్రం ఇట్లు అర్జున

టెలివిజన్‌ టీఆర్‌పీతో రికార్డులను బద్దలు కొట్టిన తేజ సజ్జా మిరాయ్

Yash: టాక్సిక్‌ తెలుగు రాష్ట్రాల హ‌క్కుల‌ను 120 కోట్ల‌కు సొంతం చేసుకున్న దిల్ రాజు

Unni Mukundan: హైదరాబాద్ లో షెడ్యూల్ పూర్తి చేసుకున్న మోదీ బయోపిక్ మా వందే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అత్యాధునిక ఆరోగ్య పరిష్కారాలపై ఏవిపిఎన్ హెల్త్ ఇంపాక్ట్ లీడర్‌షిప్ ఫోరం 2026

ఉప్పు అధికంగా తీసుకుంటే 7 సమస్యలు, ఏంటవి?

ఊపిరితిత్తుల క్యాన్సర్ చుట్టూ ఉన్న అతిపెద్ద అపోహలు బట్టబయలు

Dry Fish : పురుషులకు మేలు చేసే ఎండు చేపలు.. మధ్యాహ్నం భోజనంలో భాగం చేస్తే?

కివి పండు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments