రోబోకు మనిషి చర్మం - 1.5 మిమీ మందంతో...

Webdunia
బుధవారం, 15 జూన్ 2022 (13:37 IST)
శాస్త్రవేత్తలు అచ్చం మనిషిని పోలిన రోబోలను సృష్టించారు. అయితే, వాటికి సిలికాన్ రబ్బరు పొరను జోడించి కొంతవకు సహజ రూపాన్ని తీసుకొస్తున్నారు. రబ్బరుకు మనిషి చర్మం ఆకృతి ఎలా వస్తుందా అనే అంశంపై పరిశోధనలు చేశారు. అలాగని యూనివర్శిటీలో ఆఫ్ టోక్యోలో పరిశోధకులు నిరాశపడలేదు. రోబోల ఉపరితలం మీద మనిషి చర్మాన్ని పుట్టించే ప్రయత్నం చేసి విజయం సాధించారు. 
 
ప్లాస్టిక్ రోబో వేలుకు మృదులాస్థి, మనిషి చర్మకణాల మిశ్రమంలో ఉంచారు. మూడు రోజుల తర్వాత ఇవి రోబో వేలుకు అంటుకుపోయాయి. మన చర్మం లోపలి పొరలాంటిది ఏర్పడింది. అనంతరం దీనికి కెరటినోసైట్లలోనే చర్మ కణాల్లో పెట్టగా 1.5 మిల్లీమీటర్ల మందంతో చర్మం పైపొర పుట్టుకొచ్చింది. ఇది వేలు ముందుకు, వెనక్కు కదలుతున్నపుడు చెక్కు చెదరలేదు. 
 
పైగా ఎక్కడైనా చీరుకుపోతే మన చర్మం మాదిరిగానే తిరిగి నయం కావడం విశేషం. అయితే, రక్తనాళాలు లేకపోవడంతో వల్ల కొంత సేపటి తర్వాత ఎండిపోతోంది. ఇది తేమగా ఉండటానికి భవిష్యతులో కృత్రిమ రక్తాన్ని సరఫరా చేసే అవకాశం లేకపోలేదని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. పైగా అచ్చం మనిషి చర్మం పోలినట్టుగానే మరింత అందంగా కనిపించేలా చెమట గ్రంథులు, వెంట్రుకల కుదుళ్లలోనూ జోడించేందుకు పరిశోధనలు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సొంత ఊరు తుమ్మన్ పేటలో పెళ్లి వేడుకలు జరుపుకున్న విజయ్ దేవరకొండ

Laya: సాంప్రదాయబద్ధంగా జీవించే శివాజీ, లయ వాటిని బ్రేక్ చేస్తే?

Varalakshmi Sarath Kumar: వరలక్ష్మి శరత్ కుమార్, నవీన్ చంద్ర పై ల‌వ్ సాంగ్

వృద్దాప్యంలో విడాకులు ఎందుకు కోరుకుంటున్నారు? జబ్ ఖులి కితాబ్ ZEE5లో స్ట్రీమింగ్

109 సెంటర్లలో 50 రోజులు పూర్తి చేసుకున్న మన శంకరవరప్రసాద్ గారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మాన్యవర్ మోహే మేడ్ ఫర్ ఈచ్ అదర్‌తో రష్మిక మందన, విజయ్ దేవరకొండ

ఈ ఆహారాలతో శరీరంలోని చెడు కొవ్వు కరిగిపోద్ది

తెలంగాణలో అపోలో ఫార్మసీ 1000 స్టోర్ల మైలురాయి: హైదరాబాద్‌లో ఇ-స్టోర్‌ను ప్రారంభించిన ఉపాసన

అధునాతన మధుమేహ నిర్వహణ కోసం నోవో నార్డిస్క్ ఇండియాతో అబాట్ భాగస్వామ్యం

నిద్రలేమి ఎన్నో ఇబ్బందులు.. ఆరోగ్యానికి చేటు.. అమెరికా వైద్యులు

తర్వాతి కథనం
Show comments