Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజాకు ఏపీ హోం మినిష్టర్ పదవి రాబోతోందా? సీఎం జగన్ నిర్ణయించారా?

Webdunia
మంగళవారం, 4 ఫిబ్రవరి 2020 (15:12 IST)
వైసీపీ అధికారంలోకి రాగానే మంత్రి పదవి ఎవరికి వస్తుందనే చర్చలో మొదటి స్థానంలో రోజా పేరు వుండింది. కానీ సామాజికవర్గాల సమీకరణ తేడా కొట్టడంతో రోజాకి మొండిచెయ్యి చూపారు జగన్. దీనితో ఆమెకి ఏపీఐఐసి ఛైర్మన్ పదవి ఇచ్చి బుజ్జగించారు. ఇక ఇప్పుడు రోజాని మంత్రి పదవి వరించే అవకాశం తన్నుకుంటూ వస్తోందట. అది కూడా హోంమంత్రి పదవి వస్తుందని ప్రచారం జరుగుతోంది. 
 
అది ఎలాగంటే... శాసనమండలి రద్దు చేస్తే అందులో ఎమ్మెల్సీలుగా వున్న పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణల మంత్రి పదవులు పోతాయి. కాబట్టి వారి స్థానాల్లో వేరేవారికి.. అంటే ఎమ్మెల్యేలుగా వున్నవారికి పదవులు వస్తాయి. ఆ రకంగా చూసినప్పుడు రోజాకి మంత్రి పదవి దక్కుతుందని చర్చించుకుంటున్నారు.
 
రోజాతో పాటు స్పీకర్ తమ్మినేని సీతారాంకు మంత్రి పదవి ఇచ్చి ఆ స్థానంలో ధర్మానను ఎంపిక చేస్తారని అనుకుంటున్నారు. మరి ప్రచారంలో వున్న వార్త నిజమవుతుందో లోదో చూడాల్సిందే. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments