Webdunia - Bharat's app for daily news and videos

Install App

రామ్ గోపాల్ వర్మ చేసిన తప్పేంటి?: జగన్మోహన్ రెడ్డి ప్రశ్న

Webdunia
సోమవారం, 29 ఏప్రియల్ 2019 (11:14 IST)
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మను విజయవాడలో ప్రెస్‌మీట్ పెట్టనీయకుండా ఏపీ పోలీసులు అడ్డుకోవడంపై వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు. వర్మను అడ్డుకుని గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచే హైదరాబాద్‌కు పంపించడంపై జగన్ ఫైర్ అయ్యారు. దీనిపై స్పందించిన జగన్ వర్మను ఏపీ పోలీసులు అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండించారు. 
 
రామ్‌గోపాల్‌ వర్మ ప్రెస్‌ మీట్‌కు పోలీసులు అనుమతి నిరాకరించడానికి ఆయన చేసిన తప్పేంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇలాంటి సంఘటన ప్రజాస్వామ్యానికి మాయని మచ్చగా మిగిలిపోతాయి, ఇలాంటి వైఖరి గర్హనీయమని ట్విటర్‌లో ట్వీట్‌ చేశారు.
 
ఈ వ్యవహారంపై రామ్ గోపాల్ వర్మ తీవ్రస్థాయిలో ఏపీ సర్కారుపై మండిపడ్డారు. మే ఒకటో తేదీన విడుదల చేసేందుకు నిర్ణయించిన లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ విశేషాలను వెల్లడించేందుకు సిద్ధమైన తనను అడ్డుకోవడం ఏమిటని వర్మ ప్రశ్నించారు. తామేమైనా ఉగ్రవాదులమా అని ప్రశ్నించిన ఆయన.. న్యాయపోరాటం తప్పదని స్పష్టం చేశారు.
 
కాగా.. ఆదివారం విజయవాడలోని ఓ హోటల్‌లో ప్రెస్‌మీట్‌ నిర్వహించేందుకు వర్మతో పాటు.. మూవీ యూనిట్‌ వచ్చింది. అయితే చివరి నిమిషంలో పోలీసులు అనుమతి నిరాకరించారు. శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతాయంటూ ప్రకాశ్‌నగర్‌ సెంటర్‌లో పోలీసులు అడ్డుకున్నారు. అంతేకాకుండా వెంటనే హైదరాబాద్‌కు వెళ్లిపోవాలంటూ ఒత్తిడి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments