Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరో సంచలనానికి తెరలేపనున్న జియో... కారు చౌకకే 5జీ స్మార్ట్ ఫోన్???

Webdunia
సోమవారం, 19 అక్టోబరు 2020 (09:14 IST)
దేశీయ టెలికాం రంగనాన్ని షేక్ చేస్తున్న రిలయన్స్ జియో మరో సంచలనానికి తెరలేపనుంది. దేశంలో ఉచిత మొబైల్ సేవలను పరిచయం చేసి ఇతర ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లతో పాటు ప్రభుత్వ టెలికాం కంపెనీని చావుదెబ్బ కొట్టింది. అంతేకాకుండా, దేశ ప్రజలకు 4జీ సేవలను అందుబాటులోకి తెచ్చింది. 
 
అలాగే, అతి తక్కువ ధరకే ఫీచర్ ఫోను పరిచయం చేసింది. ఇపుడు మరో సంచలనానికి శ్రీకారం చుట్టనుంది. అదేంటంటే.. మరోమారు కారు చౌకకే 5జీ స్మార్ట్ ఫోనును ప్రవేశపెట్టనుంది. ఈ ఫోను ధర కనిష్టంగా రూ.2500 నుంచి గరిష్టంగా రూ.3000 వరకు ఉండొచ్చని రిలయన్స్ జియో వర్గాల సమాచారం. 
 
ప్రస్తుతం దేశవ్యాప్తంగా దాదాపు 30 కోట్ల మంది బేసిక్ 2జీ ఫోన్లను ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు వీరిందరినీ తమవైపునకు తిప్పుకోవాలన్న లక్ష్యంతో 5జీ కారుచౌక స్మార్ట్‌ఫోన్లను అందివ్వాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. 
 
దేశాన్ని 2జీ రహితంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని ఇటీవల ఆ సంస్థ అధినేత ముకేశ్ అంబానీ ప్రకటించారు. అందులో భాగంగానే 5జీ చౌక ఫోన్లపై దృష్టి సారించినట్టు తెలుస్తోంది. కాగా, ప్రస్తుతం అందుబాటులో ఉన్న 5జీ స్మార్ట్‌ఫోన్ల కనీస ధర రూ.27 వేలుగా ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

Ananya: స్మాల్ స్కేల్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు అడ్రెస్ గా మారిన అనన్య నాగళ్ళ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

తర్వాతి కథనం
Show comments