Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్వామిజీ ఆశీర్వాదం తీసుకున్న ర‌జ‌నీకాంత్‌, అమెరికా వెళ్తారట..

Webdunia
సోమవారం, 4 జనవరి 2021 (12:52 IST)
సూపర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాడు. అటు సినిమాలు, ఇటు రాజ‌కీయ ప్ర‌వేశం రెండు చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. త‌న ఆరోగ్యం స‌రిగా లేక‌పోవ‌డంతో రాజ‌కీయ పార్టీకి గుడ్‌బై చెబుతున్న‌ట్లు తేల్చిచెప్పారు.  ఇందుకు త‌మిళ‌నాడులో ఆయ‌న అభిమానులు చాలా నిరాశ‌తో వున్నారు. అయినా ముందు ఆరోగ్యం చూసుకోవాల‌ని అమెరికాకు వెళ్లే ప్ర‌య‌త్నంలో వున్నారు. అయితే ముందుగా ర‌జ‌నీ దంప‌తులు నమో నారాయణస్వామి ఆశీస్సులు అందుకున్నారు.
 
ర‌జ‌నీ ప‌రిస్థ‌తి చూసిన స్వామిజీ స్వ‌యంగా ర‌జ‌నీకాంత్ ఇంటికి వ‌చ్చి ఆయ‌న‌తో అర‌గంట సేపు ముచ్చ‌టించారు. ప‌లు విష‌యాల‌పై వీరిద్ద‌రు ముచ్చ‌టించుకున్నారట. వెళ్లేముందు ర‌జ‌నీకాంత్ దంప‌తుల‌కు ఆశీస్సులు అందించారు. అనారోగ్యానికి గురైన త‌ర్వాత రజనీని పరామర్శించేందుకు ఎవరికీ అనుమతి లేదని మక్కల్‌ మండ్రం వర్గాలు ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో స్వామిజీ ఎంట్రీ ఆస‌క్తిక‌రంగా మారింది.
 
అన్నాత్తె చిత్ర షూటింగ్ కోసం హైద‌రాబాద్‌కు వ‌చ్చిన ర‌జ‌నీకాంత్ అనారోగ్యానికి గురైన సంగ‌తి తెలిసిందే. మ‌రి ర‌జ‌నీ షూటింగ్ పూర్తి చేస్తాడా లేదా.. అనేది ప‌క్క‌న పెడితే.. ఆరోగ్యం కోసం స్వామిజీ ఆశీస్స‌లు తీసుకున్నాడ‌ని సన్నిహిత వ‌ర్గాలు చెబుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రూ.21 కోట్లు వడ్డీతో చెల్లించండి.. విశాల్‌కు హైకోర్టు ఆదేశం

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments