Webdunia - Bharat's app for daily news and videos

Install App

తృటిలో పెను ప్రమాదం తప్పింది.. మహిళను అలా కాపాడిన రైల్వే పోలీస్

Webdunia
శనివారం, 21 డిశెంబరు 2019 (18:54 IST)
పెను ప్రమాదం నుంచి ఆ మహిళ తృటిలో తప్పించుకుంది. ఆ క్షణంలో ప్రాణంపోయి ఉంటే ఏమయ్యేదోనన్న భయం ఆమెను కుదిపేసింది. రైలు ప్రయాణంలో బోగీనుంచి కిందకు దిగేందుకు ప్రయత్నిస్తూ జారిపోయిందో మహిళ. అయితే అదే ప్లాట్ ఫామ్‌పై కాపలా కాస్తున్న ఓ పోలీస్ ఆమె పాలిట దేవుడిలా మారాడు బోగీనుంచి జారిపోతున్న ఆమెను ప్లాట్ ఫామ్ మీదకు అత్యంత లాఘవంగా లాగేశాడు. 
 
వివరాల్లోకి వెళితే.. సికింద్రాబాద్ నుంచి ధన్ పూర్ వరకూ వెళ్లే ఎక్స్ ప్రెస్ ట్రైన్ దాని నెంబర్ 12791 ఈ ట్రైన్ లోని ఎస్ 12 బోగీ నుంచి ఓ ప్రయాణీకురాలు దిగబోతోంది. అంతలోనే ఏమైందో ఏమోకానీ ఆమె కాలు జారి రైలుకు, ప్లాట్ ఫామ్‌కు మధ్యకు జారిపోబోయింది. అంతలో అదే రైలును గమనిస్తున్న రైల్వే రక్షణ దళ సిబ్బంది అప్రమత్తమయ్యాడు. 
 
రైలుకు, ప్లాట్ ఫామ్‌కు మధ్యకు జారిపోతున్న ఆమెను అతి బలవంతం మీద బలమంతా ప్రయోగించి ప్లాట్ ఫామ్ పైకి లాగాడు. ప్రాణాపాయం నుంచి ఆమెను కాపాడాడు. ఈ సంఘటన ఈనెల 18న జరిగింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments