Webdunia - Bharat's app for daily news and videos

Install App

నవ శకానికి నాంది పలుకనున్న శివంగి సింగ్... ఎందుకో తెలుసా?

Webdunia
బుధవారం, 23 సెప్టెంబరు 2020 (14:24 IST)
దేశ ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యం వహిస్తున్న వారణాసి లోక్‌సభ స్థానానికి చెందిన శివంగి సింగ్ నవ శకానికి నాంది పలుకనుంది. ఎందుకంటే... భారత వాయు సేనలో (ఐఏఎఫ్)లో కొత్తగా చేరిన అత్యాధునిక రాఫెల్ యుద్ధ విమానాన్ని నడిపే తొలి మహిళా పైలట్‌గా ఫ్లైట్ లెఫ్టినెంట్ శివంగి సింగ్ అవతరించబోతున్నారు. 
 
2017లో ఐఏఎఫ్‌లో చేరిన ఆమె మహిళల రెండో బ్యాచ్‌లో ఫైటర్‌ పైలట్‌గా శిక్షణ పూర్తిచేశారు. ఈమె త్వరలోనే అంబాలాలోని 17 స్క్వాడ్రన్‌కు చెందిన రాఫెల్‌ 'గోల్డెన్ యారో‌స్'లో భాగంకానున్నారు. దీనికోసం ఆమె ప్రత్యేక శిక్షణ పొందుతున్నారు. ఇప్పటివరకు మిగ్ -21 బైసన్‌ యుద్ధ విమానాలు నడిపిన శివంగి సింగ్‌, ఇటీవలే రాజస్థాన్‌లోని వైమానిక స్థావరం నుంచి అంబాలా ఎయిర్‌ బేస్‌కు చేరుకున్నారు. 
 
వారణాసిలో ప్రాథమిక విద్య అనంతరం బెనారస్‌ హిందూ యూనివర్సిటీలో శివంగి సింగ్‌ చేరారు. 7 యూపీ ఎయిర్‌ స్క్వాడ్రన్‌లోఎన్‌సీసీ క్యాడెట్‌గా ఉన్న ఆమె అనంతరం 2016 నుంచి ఎయిర్‌ ఫోర్స్‌ అకాడమీలో శిక్షణ పొందారు. పాతకాలపు మిగ్‌ 21 యుద్ధ విమానం నుంచి మొదలైన ఆమె శిక్షణ ప్రస్తుతం కొత్త తరం రాఫెల్‌ యుద్ధ విమానం నడపటం వరకు కొనసాగింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్‌ ఇంట్లో మొదలైన ప్రేమ.. అమీర్‌ను పెళ్లాడనున్న పావని రెడ్డి

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ

రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

కార్తీక్ ఆర్యన్‌తో గ్లామర్ డోస్ పెంచేసిన శ్రీలీల.. బాలీవుడ్‌లో హిట్టవుతుందా? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments