నవ శకానికి నాంది పలుకనున్న శివంగి సింగ్... ఎందుకో తెలుసా?

Webdunia
బుధవారం, 23 సెప్టెంబరు 2020 (14:24 IST)
దేశ ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యం వహిస్తున్న వారణాసి లోక్‌సభ స్థానానికి చెందిన శివంగి సింగ్ నవ శకానికి నాంది పలుకనుంది. ఎందుకంటే... భారత వాయు సేనలో (ఐఏఎఫ్)లో కొత్తగా చేరిన అత్యాధునిక రాఫెల్ యుద్ధ విమానాన్ని నడిపే తొలి మహిళా పైలట్‌గా ఫ్లైట్ లెఫ్టినెంట్ శివంగి సింగ్ అవతరించబోతున్నారు. 
 
2017లో ఐఏఎఫ్‌లో చేరిన ఆమె మహిళల రెండో బ్యాచ్‌లో ఫైటర్‌ పైలట్‌గా శిక్షణ పూర్తిచేశారు. ఈమె త్వరలోనే అంబాలాలోని 17 స్క్వాడ్రన్‌కు చెందిన రాఫెల్‌ 'గోల్డెన్ యారో‌స్'లో భాగంకానున్నారు. దీనికోసం ఆమె ప్రత్యేక శిక్షణ పొందుతున్నారు. ఇప్పటివరకు మిగ్ -21 బైసన్‌ యుద్ధ విమానాలు నడిపిన శివంగి సింగ్‌, ఇటీవలే రాజస్థాన్‌లోని వైమానిక స్థావరం నుంచి అంబాలా ఎయిర్‌ బేస్‌కు చేరుకున్నారు. 
 
వారణాసిలో ప్రాథమిక విద్య అనంతరం బెనారస్‌ హిందూ యూనివర్సిటీలో శివంగి సింగ్‌ చేరారు. 7 యూపీ ఎయిర్‌ స్క్వాడ్రన్‌లోఎన్‌సీసీ క్యాడెట్‌గా ఉన్న ఆమె అనంతరం 2016 నుంచి ఎయిర్‌ ఫోర్స్‌ అకాడమీలో శిక్షణ పొందారు. పాతకాలపు మిగ్‌ 21 యుద్ధ విమానం నుంచి మొదలైన ఆమె శిక్షణ ప్రస్తుతం కొత్త తరం రాఫెల్‌ యుద్ధ విమానం నడపటం వరకు కొనసాగింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆర్టిస్టుల సమస్యలను దాటి తెరకెక్కిన పండంటి కాపురం ఒక తెలుగు క్లాసిక్

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇంట్లో దీపావళి పార్టీ కారణం అదే..

Pawan Kalyan: పవన్ కల్యాణ్ సినిమా ప్రయాణం ఇంకా ముగియలేదా? నెక్ట్స్ సినిమా ఎవరితో?

K Ramp: కొందరు కావాలనే K-ర్యాంప్ మూవీపై పక్షపాతం చూపిస్తున్నారు : నిర్మాత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments