Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరికొన్ని గంటల్లో భారత్‌కు రాఫెల్ యుద్ధ విమానాలు...

Webdunia
బుధవారం, 29 జులై 2020 (08:46 IST)
ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేసిన రాఫెల్ యుద్ధ విమానాలు మరికొన్ని గంటల్లో భారత్‌కు చేరుకోనున్నాయి. ఫ్రాన్స్ నుంచి సోమవారం బయలుదేరిన ఈ యుద్ధ విమానాలు ఏడు వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి బుధవారం అంబాలా వాయుసేన బేస్‌కు చేరుకోనున్నాయి. మొత్తం 35 విమానాలను భారత్ కొనుగోలు చేస్తుండగా, వీటిలో తొలి దశలో ఐదు విమానాలను భారత్‌కు ఫ్రాన్స్ పంపిస్తోంది. 
 
ఈ ఐదు విమానాలు మరికొన్ని గంటల్లో అంబాలా ఎయిర్‌బేస్‌లో ల్యాండింగ్ కానున్నాయి. ఒకవేళ రాఫెల్ విమానాలు దిగే సమయంలో అంబాలాలో గనక వాతావరణం బాగోలేకపోతే... జోధ్‌పూర్‌లోని ఎయిర్ బేస్‌ను అధికారులు ప్రత్యామ్నాయంగా ఎంచుకున్నారు. అయితే, ఈ విషయాన్ని అధికారులు అత్యంత గోప్యంగా ఉంచారు. 
 
ఫొటోలు నిషిద్ధం... 144 సెక్షన్ విధింపు
మరోవైపు, ఫ్రాన్స్ నుంచి రఫేల్ విమానాలు బుధవారం అనుకున్న దాని ప్రకారం అంబాలాకు చేరుకోనున్న విషయం తెలిసిందే. దీంతో వైమానిక స్థావరం చుట్టుపక్కల ప్రాంతాల్లో సెక్షన్ 144 విధించారు. భద్రతా కారణాల రీత్యా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వారు తెలిపారు. 
 
అంబాలా ఎయిర్ బేస్ సమీపంలో ఉన్న 4 గ్రామాల్లో కర్ఫ్యూ అమల్లో ఉండనుంది. విమానాలు ల్యాండయ్యే సమయంలో.. రన్‌వేకు సమీపంలోని ఇళ్లపై ప్రజలు గుమిగూడటం, ఫోటోలు తీయడంపై కూడా నిషేధం విధించామని అంబాలా డీఎస్పీ తెలిపారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రిసార్టులో హంగామా సృష్టించిన సినీ నటి కల్పిక

Payal Rajput: పాయల్ రాజ్‌పుత్ ఇంట తీవ్ర‌ విషాదం-ఆమె తండ్రి క‌న్నుమూత‌

'ఆర్ఎక్స్-100' హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్‌కు పితృవియోగం

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments