Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరికొన్ని గంటల్లో భారత్‌కు రాఫెల్ యుద్ధ విమానాలు...

Webdunia
బుధవారం, 29 జులై 2020 (08:46 IST)
ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేసిన రాఫెల్ యుద్ధ విమానాలు మరికొన్ని గంటల్లో భారత్‌కు చేరుకోనున్నాయి. ఫ్రాన్స్ నుంచి సోమవారం బయలుదేరిన ఈ యుద్ధ విమానాలు ఏడు వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి బుధవారం అంబాలా వాయుసేన బేస్‌కు చేరుకోనున్నాయి. మొత్తం 35 విమానాలను భారత్ కొనుగోలు చేస్తుండగా, వీటిలో తొలి దశలో ఐదు విమానాలను భారత్‌కు ఫ్రాన్స్ పంపిస్తోంది. 
 
ఈ ఐదు విమానాలు మరికొన్ని గంటల్లో అంబాలా ఎయిర్‌బేస్‌లో ల్యాండింగ్ కానున్నాయి. ఒకవేళ రాఫెల్ విమానాలు దిగే సమయంలో అంబాలాలో గనక వాతావరణం బాగోలేకపోతే... జోధ్‌పూర్‌లోని ఎయిర్ బేస్‌ను అధికారులు ప్రత్యామ్నాయంగా ఎంచుకున్నారు. అయితే, ఈ విషయాన్ని అధికారులు అత్యంత గోప్యంగా ఉంచారు. 
 
ఫొటోలు నిషిద్ధం... 144 సెక్షన్ విధింపు
మరోవైపు, ఫ్రాన్స్ నుంచి రఫేల్ విమానాలు బుధవారం అనుకున్న దాని ప్రకారం అంబాలాకు చేరుకోనున్న విషయం తెలిసిందే. దీంతో వైమానిక స్థావరం చుట్టుపక్కల ప్రాంతాల్లో సెక్షన్ 144 విధించారు. భద్రతా కారణాల రీత్యా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వారు తెలిపారు. 
 
అంబాలా ఎయిర్ బేస్ సమీపంలో ఉన్న 4 గ్రామాల్లో కర్ఫ్యూ అమల్లో ఉండనుంది. విమానాలు ల్యాండయ్యే సమయంలో.. రన్‌వేకు సమీపంలోని ఇళ్లపై ప్రజలు గుమిగూడటం, ఫోటోలు తీయడంపై కూడా నిషేధం విధించామని అంబాలా డీఎస్పీ తెలిపారు.  

సంబంధిత వార్తలు

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

ఓటు వేసేందుకు బయటికి రాని ప్రభాస్.. ట్రోల్స్ మొదలు..!

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

తర్వాతి కథనం
Show comments