Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీ నేతలకు చేతబడి చేశారు.. అందుకే వరుస మరణాలు : సాధ్వీ ప్రజ్ఞాసింగ్

Webdunia
సోమవారం, 26 ఆగస్టు 2019 (19:00 IST)
భారతీయ జనతా పార్టీకి చెందిన ఎంపీ సాధ్వీ ప్రజ్ఞాసింగ్ మరోమారు వార్తల్లోకెక్కారు. ఇటీవలి కాలంలో బీజేపీ నేతలు వరుసగా చనిపోతున్నారు. ఈ మరణాలపై కమలనాథులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సాధ్వీ ప్రజ్ఞాసింగ్ స్పందిస్తూ, తమ పార్టీ నేతలకు చేతబడి చేశారనీ అందుకే వరుసగా చనిపోతున్నారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 
 
కాగా గత యేడాది కాలంలో మాజీ ప్రధాని వాజ్‌పేయి మొదలుకుని తాజాగా అరుణ్ జైట్లీ వరకు అనేక మంది చనిపోయారు. ముఖ్యంగా, 20 రోజుల వ్యవధిలో అగ్రనేతలుగా ఉన్న సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీలు అనారోగ్యం కారణంగా చనిపోయారు. దీంతో బీజేపీ శ్రేణులు విషాదంలో మునిగిపోయాయి. 
 
ఈ క్రమంలో సోమవారం విలేకరులతో మాట్లాడిన భోపాల్‌ ఎంపీ సాధ్వి ప్రఙ్ఞా, 'బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు క్షుద్ర పూజలు చేయిస్తున్నాయని మహారాజ్‌ గారు నాకు ఒకానొక సమయంలో చెప్పారు. ఆయన చెప్పినట్లుగానే మాకు ఇప్పుడు చెడుకాలం జరుగుతోంది. అయితే అప్పుడు ఆయన చెప్పిన విషయాన్ని నేను మర్చిపోయాను. కానీ మా పార్టీకి చెందిన పలువురు అగ్రనేతలు ఒక్కక్కరుగా మమ్మల్ని విడిచి వెళ్తున్నారు. మహారాజ్‌ చెప్పింది నిజమేనేమోనని నాకు ఇప్పుడు అనినిపిస్తోంది' అని వ్యాఖ్యానించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Deepika Padukone: అల్లు అర్జున్, అట్లీ చిత్రంలో బాలీవుడ్ దీపికా పదుకొనె

Pawan : ఎ.ఎం.రత్నం కు అన్నీ అడ్డంకులేనా? హరిహర వీరమల్లు ఆలస్యానికి కారణమదేనా?

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments