Webdunia - Bharat's app for daily news and videos

Install App

పీవోకే కూడా భారత భూభాగమే... అమిత్ షా : నెక్స్ట్ టార్గెట్ అదేనా?

Webdunia
మంగళవారం, 6 ఆగస్టు 2019 (15:29 IST)
కాశ్మీర్ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనాలన్న లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సర్కారు ఉన్నట్టు తెలుస్తోంది. ఇందులోభాగంగా, జమ్మూకాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తూ వచ్చిన ఆర్టికల్ 370ని మోడీ సర్కారు రద్దు చేసింది.

ఈ నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభలో జమ్మూకాశ్మీర్ విభజన బిల్లును ప్రవేశపెట్టిన తర్వాత ఆయన మాట్లాడుతూ, కాశ్మీరులో ప్రజలు దశాబ్దాల తరబడి అన్యాయానికి గురవుతుంటే, ఎన్నో ఏళ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ వారిని పట్టించుకోలేదని ఆరోపించారు. కాశ్మీరులో ఉద్రిక్తతలకు కారణం కాంగ్రెస్ వైఖరేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
ఇప్పటికే రాజ్యసభలో జమ్మూ కాశ్మీర్ పునర్విభజన బిల్లు ఆమోదం పొందిందని, రాష్ట్రపతి కూడా బిల్లు పట్ల సానుకూల వైఖరితోనే ఉన్నారని తెలిపారు. లోక్‌సభలో బిల్లు ఆమోదం పొందేందుకు విపక్ష పార్టీలు సహకరిస్తే.. ప్రజలు హర్షిస్తారని స్పష్టం చేశారు. ఈ బిల్లు అమలైతే కాశ్మీర్ వాసులకు ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయన్నారు. జమ్మూ కాశ్మీర్ అంశంతో ఇతర దేశాలకు, ముఖ్యంగా పాకిస్థాన్‌కు ఏ మాత్రం సంబంధం లేదని, ప్రస్తుతం పాక్ ఆక్రమిత ప్రాంతంగా ఉన్న కాశ్మీర్ కూడా భారత్‌లో అంతర్భాగమేనని స్పష్టం చేశారు. పాకిస్థాన్ ఆ ప్రాంతం నుంచి వైదొలగాలని హితవు పలికారు.
 
అమిత్ షా చేసిన ఈ వ్యాఖ్యలు ఇపుడు చర్చనీయాంశంగా మారాయి. ఎందుకంటే పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు పీవోకేలో ఉగ్ర శిబిరాలను ఏర్పాటు చేసి శిక్షణ పొందుతున్నాయి. ఆ తర్వాత బంగ్లాదేశ్, మయన్మార్, హిమాలయా పర్వతాల మీదుగా భారత భూభాగంలోకి చొరబడి... విధ్వంసం సృష్టించేందుకు కుట్రలు పన్నుతున్నాయి. ఈ క్రమంలో పీవోకే కూడా భారత్‌లో ఓ అంతర్భాగమని అమిత్ షా ప్రకటించడంతో ఆ ప్రాంతంపై మోడీ - షా ద్వయం గురిపెట్టినట్టు తెలుస్తోంది. మొత్తంమీ కాశ్మీర్ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనేలా కేంద్రం పావులు కదుపుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajendra prasad: నేను సరదాగా మాట్లాడతాను. అర్థంకాకపోతే అది మీ ఖర్మ: రాజేంద్రప్రసాద్

ఎక్కడ ఆ లం- కొడుకు? నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ బూతు కిరీటి అవుతున్నారా?

నాన్నగారి సంవత్సరికం తర్వాత మా పెళ్లి : నారా రోహిత్

Khaleja: ఖలేజా రీ-రిలీజ్- మొదటి రోజే రూ.8కోట్లు.. ఆల్ టైమ్ రికార్డ్ నమోదు

NBK: బాలక్రిష్ణ పుట్టినరోజున అఖండ2 అప్ డేట్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments