టీడీపీ నేతలకు పౌరుషం లేదు.. పవన్ కళ్యాణ్

Webdunia
ఆదివారం, 4 నవంబరు 2018 (14:01 IST)
తెలుగుదేశం పార్టీ నేతలకు ఏమాత్రం పౌరుషం లేదని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు. రాష్ట్రంలో అవినీతితో కూడిన రాజకీయ వ్యవస్థ నెలకొని ఉందని, దీనిని చూస్తుంటే అసహ్యం వేస్తోందన్నారు. 
 
తూర్పు గోదావరి జిల్లా అన్నవరంలో శనివారం నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను ఓడిపోవడానికైనా సిద్ధపడతాను కానీ పార్టీ విలువలను చంపనన్నారు. ఏటా సినిమాల ద్వారా రూ.100 కోట్లు సంపాదిస్తే అందులో 25 కోట్లు పన్నులుగా కడతానన్నారు. 
 
అయినా సినిమాలపై మమకారం లేదని సమాజంపై బాధ్యత ఉందన్నారు. కార్యకర్తలు కొట్టే చప్పట్లు, కేరింతలు తనను సంతోష పెట్టవని... వాటిని బాధ్యతగా స్వీకరిస్తానన్నారు. సినిమాలు వేరు, రాజకీయాలు వేరన్నారు. సినిమాలు కేవలం అవగాహన కల్పించడానికేనని, రాజకీయాలు వాటిని పరిష్కరించ డానికి దోహదపడతాయన్నారు.
 
వ్యాపారులు ఎంపీలుగా వెళ్తుంటే పరిస్థితులు ఇలాగే ఉంటాయన్నారు. కులాల ముసుగులో ఉన్నవారిని ప్రజాకోర్టులో నిలదీద్దామన్నారు. వాల్మీకి, యోగి వేమనల్లో మార్పు వచ్చినట్టే చంద్రబాబు మనసు కూడా మారుతుందనే చిన్నపాటి నమ్మకంతో 2014లో మద్దతు ఇచ్చానని, అయితే ఆయన ఇంకా నిద్రాణంలోనే ఉన్నారన్నారు. మెట్టుమెట్టుగా ఎదుగుదామన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika Mandanna: తప్పుడు ప్రచారం చేసిన వారిపై రష్మిక మందన్నా ఘాటు హెచ్చరిక

Aadi: షూటింగ్ లో యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ బుల్లెట్ రెడ్డి

Vishal: ఎం.జి.ఆర్..పై రాజేంద్ర ప్రసాద్ మాటల్ని ఖండించిన తమిళ హీరో విశాల్

కొండాలక్ష్మణ్ బాపూజీ డాక్యుమెంటరీ విధానంపై జ్యూరీ సభ్యులు ప్రశంసలు

Dhurandhar: ధురంధర్: ది రివెంజ్ కు ముందు ధురంధర్ రీ-రిలీజ్ కాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నల్ల ద్రాక్షలో వున్న పోషకాలు ఏమిటి? వాటి ప్రయోజనాలు ఏమిటి?

అల్లంతో గృహవైద్యం అంటారు, ఎందుకు?

కొలెస్ట్రాల్‌ను కరిగించే బొప్పాయి, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

కడుపులో మంటగా ఉందా?

షార్లెట్‌లో నాట్స్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు

తర్వాతి కథనం
Show comments