Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిదంబరంకు షాక్.. విచారణాధికారిపై బదిలీవేటు.. ఈడీ చర్యలు

Webdunia
గురువారం, 22 ఆగస్టు 2019 (14:00 IST)
ఐఎన్ఎక్స్ మీడియా స్కామ్‌లో అరెస్టు అయిన కేంద్ర ఆర్థిక మాజీ మంత్రి పి. చిదంబరంకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ తేరుకోలేని షాకిచ్చింది. ఈ కేసును ఆది నుంచి విచారిస్తూ వచ్చిన అహుజాపై బదిలీ వేటు వేసి, ఈ కేసును విచారించేందుకు కొత్త అధికారిని నియమించింది. దీంతో ఈ కేసు విచారణ మొదటి నుంచి సాగనుంది.
 
అదేసమయంలో ఈ స్కామ్‌లో చిదంబరం వద్ద విచారించేందుకు వీలుగా ప్రశ్నావళిని రూపొందించింది. చిదంబరం వద్ద విచారించేందుకు సీబీఐ అధికారులు  100 ప్రశ్నలను సిద్ధం చేసినట్టు సమాచారం.
 
మరోవైపు, చిదంబరం అరెస్టు వ్యవహారం రాజకీయ ప్రకంపనలు పుట్టిస్తోంది. కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపుకు పాల్పడుతోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. సీబీఐ, ఈడీలను స్వార్థ రాజకీయాల కోసం బీజేపీ వాడుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. చిదంబరంకు అండగా ఉంటామని... చివరివరకు పోరాడుతామని తెలిపింది.
 
కాగా, ఈ కేసులో చిదంబరంను బుధవారం రాత్రి సీబీఐ అరెస్టు చేసిన విషయం తెల్సిందే. ఆ తర్వాత ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయంలో బుధవారం రాత్రంతా చిదంబరంను ఉంచారు. గురువారం ఉదయం సీబీఐ ప్రత్యేక కోర్టులో చిదంబరంను హాజరుపరిచి, విచారణ నిమిత్తం కస్టడీకి కోరనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

డైరెక్టర్లే నన్ను కొత్తగా చూపించే ప్రయత్నం చేయాలి : బ్రహ్మానందం

సుధీర్ బాబు హీరోగా జీ స్టూడియోస్ సమర్పణలో జటాధర ప్రారంభం

యుద్దం రేపటి వెలుగు కోసం అనేది త్రికాల ట్రైలర్

మహిళా సాధికారతపై తీసిన నేనెక్కడున్నా ట్రైలర్ విడుదల చేసిన ఈటల రాజేందర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments