Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిదంబరంకు షాక్.. విచారణాధికారిపై బదిలీవేటు.. ఈడీ చర్యలు

Webdunia
గురువారం, 22 ఆగస్టు 2019 (14:00 IST)
ఐఎన్ఎక్స్ మీడియా స్కామ్‌లో అరెస్టు అయిన కేంద్ర ఆర్థిక మాజీ మంత్రి పి. చిదంబరంకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ తేరుకోలేని షాకిచ్చింది. ఈ కేసును ఆది నుంచి విచారిస్తూ వచ్చిన అహుజాపై బదిలీ వేటు వేసి, ఈ కేసును విచారించేందుకు కొత్త అధికారిని నియమించింది. దీంతో ఈ కేసు విచారణ మొదటి నుంచి సాగనుంది.
 
అదేసమయంలో ఈ స్కామ్‌లో చిదంబరం వద్ద విచారించేందుకు వీలుగా ప్రశ్నావళిని రూపొందించింది. చిదంబరం వద్ద విచారించేందుకు సీబీఐ అధికారులు  100 ప్రశ్నలను సిద్ధం చేసినట్టు సమాచారం.
 
మరోవైపు, చిదంబరం అరెస్టు వ్యవహారం రాజకీయ ప్రకంపనలు పుట్టిస్తోంది. కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపుకు పాల్పడుతోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. సీబీఐ, ఈడీలను స్వార్థ రాజకీయాల కోసం బీజేపీ వాడుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. చిదంబరంకు అండగా ఉంటామని... చివరివరకు పోరాడుతామని తెలిపింది.
 
కాగా, ఈ కేసులో చిదంబరంను బుధవారం రాత్రి సీబీఐ అరెస్టు చేసిన విషయం తెల్సిందే. ఆ తర్వాత ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయంలో బుధవారం రాత్రంతా చిదంబరంను ఉంచారు. గురువారం ఉదయం సీబీఐ ప్రత్యేక కోర్టులో చిదంబరంను హాజరుపరిచి, విచారణ నిమిత్తం కస్టడీకి కోరనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ సినిమాకు టిక్కెట్ రేట్లు పెంచండి... ఏఎం రత్నం వినతి

హరిహరవీరమల్లు టికెట్ ధర ఆమోదం కోరుతూ ఛాంబర్ కి అభ్యర్థన

Ali: రాజేంద్రప్రసాద్ గారు సరదాగా మాట తూలారు : అలీ స్పందన

పెళ్లి పుస్తకం నుంచి షష్టిపూర్తి వరకు ఎవరికీ దక్కనిది నాకు దక్కింది: డా. రాజేంద్ర ప్రసాద్

సాయి కుమార్ నటించిన చౌకీదార్ నుంచి నాన్న.. పాట విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments