Webdunia - Bharat's app for daily news and videos

Install App

#KashmirParFinalFight ఇంటర్నెట్ సేవలు కట్.. ఉద్రిక్త వాతావరణం

Webdunia
సోమవారం, 5 ఆగస్టు 2019 (10:26 IST)
జమ్మూకాశ్మీర్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాశ్మీర్‌లో మునుపెన్నడూ లేని పరిణామాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో.. ఆ రాష్ట్ర భవితవ్యంపై అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. సోమవారం ఉదయం 9:30 గంటలకు జరగబోయే కేంద్ర కేబినెట్ సమావేశంలో కాశ్మీర్ భవితవ్యంపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 
 
కాశ్మీర్‌లో ఆర్టికల్ 370ని రద్దు చేయడం.. లేదా కాశ్మీర్‌ను మూడు రాష్ట్రాలుగా విభజించడం అనే ఎత్తుగడతో కేంద్రం ముందుకు కదులుతోందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సోమవారం లేదా మంగళవారం కేంద్రం చర్యలపై కొంతలో కొంతైనా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
 
ఈ నేపథ్యంలో కాశ్మీర్‌ లోయలో అడుగడుగునా భద్రతా బలాలను మోహరించారు. కాశ్మీర్‌ మాజీ సీఎంలు మెహబూబా ముఫ్తీ, ఒమర్ అబ్దుల్లాలను ఆదివారం రాత్రి నుంచి గృహ నిర్బంధం చేశారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. బహిరంగ సమావేశాలు, గుంపులుగా తిరగడాలను నిషేధించారు. శ్రీనగర్ జిల్లాలో సెక్షన్ 144 అమలుచేశారు. 
 
కాగా, కాశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటికే పలు దేశాలు తమ దేశ పర్యాటకులను కాశ్మీర్ నుంచి వెనక్కి రావాల్సిందిగా పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఇక కాశ్మీర్‌లోని ఎన్ఐటికి సెలవులు ప్రకటించి.. విద్యార్థులను కూడా ఖాళీ చేయించింది కేంద్ర ప్రభుత్వం. అమర్‌నాథ్ యాత్ర ప్రయాణికులను కూడా వెనక్కి పంపించేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments