Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్షమించండి, నేను పార్టీ పెట్టలేను, నాకు అనారోగ్యం అందుకే: రజినీకాంత్ సంచలనం

Webdunia
మంగళవారం, 29 డిశెంబరు 2020 (12:34 IST)
తమిళనాడులో మరికొన్ని రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపధ్యంలో రాజకీయ పార్టీ పెడతానంటూ చెప్పిన రజినీకాంత్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తను రాజకీయ పార్టీని పెట్టడంలేదని ఓ సుదీర్ఘ లేఖ ద్వారా తెలియజేసారు.
 
ఇటీవలే హైదరాబాద్ అపోలో ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన రెండు రోజుల తరువాత ఆయన ఒక ప్రకటనను విడుదల చేశారు. "నేను రాజకీయాల్లోకి ప్రవేశించలేనని తీవ్ర విచారంతో చెప్తున్నాను, ఈ నిర్ణయాన్ని ప్రకటిస్తున్నప్పుడు నేను పడుతున్న బాధ నాకు మాత్రమే తెలుసు. రాజకీయాల్లోకి ప్రవేశించకుండా, నేను ప్రజలకు సేవ చేస్తాను. నా ఈ నిర్ణయం నా అభిమానులను మరియు ప్రజలను నిరాశపరుస్తుంది, కాని దయచేసి నన్ను క్షమించండి" అని వెల్లడించారు.
 
రెండేళ్ల క్రితం రజినీ మక్కల్ మండలం ఏర్పాటు చేసిన రజనీకాంత్ తన రాజకీయ పార్టీని డిసెంబర్ 31న ప్రకటిస్తానని చెప్పారు. ఐతే తన అనారోగ్య కారణాలు రీత్యా పార్టీని పెట్టడంలేదని తెలిపారు. తమిళనాడు రాష్ట్ర ఎన్నికలకు మరో ఐదు నెలల సమయముంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆస్కార్ 2025 విజేతలు వీరే : భారతీయ చిత్రం అనూజకు అవార్డు దక్కిందా?

బ్రాండ్ అంబాసిడర్‌గా మీనాక్షి చౌదరినా? ఫ్యాక్ట్ చెక్

ఆశిష్ గాంధీ, మానస రాధాకృష్ణన్ జంటగా కొత్త చిత్రం

ఒకరోజు ముందుగానే నవ్వులు పంచనున్న 'మ్యాడ్ స్క్వేర్' చిత్రం

చిరంజీవికి బ్రిటన్ పౌరసత్వం : వార్తల్లో నిజం లేదని స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

యూరిక్ యాసిడ్ తగ్గడానికి ఏమి చేయాలి?

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

మహిళలు అల్లంతో కూడిన మజ్జిగ తాగితే.. నడుము చుట్టూ ఉన్న కొవ్వు?

తర్వాతి కథనం
Show comments