క్షమించండి, నేను పార్టీ పెట్టలేను, నాకు అనారోగ్యం అందుకే: రజినీకాంత్ సంచలనం

Webdunia
మంగళవారం, 29 డిశెంబరు 2020 (12:34 IST)
తమిళనాడులో మరికొన్ని రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపధ్యంలో రాజకీయ పార్టీ పెడతానంటూ చెప్పిన రజినీకాంత్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తను రాజకీయ పార్టీని పెట్టడంలేదని ఓ సుదీర్ఘ లేఖ ద్వారా తెలియజేసారు.
 
ఇటీవలే హైదరాబాద్ అపోలో ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన రెండు రోజుల తరువాత ఆయన ఒక ప్రకటనను విడుదల చేశారు. "నేను రాజకీయాల్లోకి ప్రవేశించలేనని తీవ్ర విచారంతో చెప్తున్నాను, ఈ నిర్ణయాన్ని ప్రకటిస్తున్నప్పుడు నేను పడుతున్న బాధ నాకు మాత్రమే తెలుసు. రాజకీయాల్లోకి ప్రవేశించకుండా, నేను ప్రజలకు సేవ చేస్తాను. నా ఈ నిర్ణయం నా అభిమానులను మరియు ప్రజలను నిరాశపరుస్తుంది, కాని దయచేసి నన్ను క్షమించండి" అని వెల్లడించారు.
 
రెండేళ్ల క్రితం రజినీ మక్కల్ మండలం ఏర్పాటు చేసిన రజనీకాంత్ తన రాజకీయ పార్టీని డిసెంబర్ 31న ప్రకటిస్తానని చెప్పారు. ఐతే తన అనారోగ్య కారణాలు రీత్యా పార్టీని పెట్టడంలేదని తెలిపారు. తమిళనాడు రాష్ట్ర ఎన్నికలకు మరో ఐదు నెలల సమయముంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tulasi: సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించిన నటి తులసి

Rajamouli: డైరెక్టర్ రాజమౌళిపై 3 కేసులు నమోదు

Vantalakka: బిజీ షెడ్యూల్‌ వల్ల భర్త, పిల్లల్ని కలుసుకోలేకపోతున్నాను.. వంటలక్క ఆవేదన

Hero Karthi: అన్నగారు వస్తారు అంటున్న హీరో కార్తి

నేడు నయనతార బర్త్‌డే.. ఖరీదైన బహమతిచ్చిన భర్త

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments