Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈశాన్య రాష్ట్రాల్లోనే ఎన్నార్సీ... ఆందోళనలు వద్దు.. కేంద్రం

Webdunia
మంగళవారం, 4 ఫిబ్రవరి 2020 (13:51 IST)
కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలక ప్రకటన చేసింది. దేశ వ్యాప్తంగా ఎన్నార్సీకి వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్నాయి. గత రెండు రోజులుగా పార్లమెంట్‌‌లో సైతం విపక్ష పార్టీలు రభస చేస్తున్నాయి. ఈ జాతీయ పౌర జాబితా (ఎన్.ఆర్.సి) రద్దు చేయాలని విపక్ష పార్టీలన్నీ ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నాయి. అలాగే, దేశ వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి.
 
ఈనేపథ్యంలో ఎన్నార్సీ అమలుపై కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో అత్యంత కీలక ప్రకటన చేసింది. ఎన్నార్సీ అమలుపై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కేంద్ర హోంశాఖ కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు లోక్‌సభ లిఖిత పూర్వకంగా దీనిపై సమాధానం ఇచ్చింది. 
 
ఇప్పటికైనా ఎన్నార్సీపై చేస్తున్న ఆందోళనలు విరమించుకోవాలని విజ్ఞప్తి చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈశాన్య రాష్ట్రాల్లో మాత్రమే ఎన్నార్సీని అమలు చేస్తున్నామని, మిగతా రాష్ట్రాల్లో దీని అమలుకు సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని హోంశాఖ ఆ ప్రకటనలో పేర్కొంది.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments