ఐరాసలో నిత్యానంద రాగం.. కైలాస నుంచి మహిళా ప్రతినిధి స్పీచ్!

Webdunia
బుధవారం, 1 మార్చి 2023 (13:29 IST)
Nithyananda
వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అత్యాచారం, అపహరణ వంటి పలు కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిత్యానందపై భారత్‌లో నాన్ బెయిలబుల్ వారెంట్ సైతం జారీ అయ్యింది. 2019లో దేశం నుంచి పారిపోయిన నిత్యానంద.. 2020లో ఈక్వెడార్ తీరానికి దగ్గర ఓ ద్వీపాన్ని కైలాస దేశంగా ప్రకటించారు. ఇక అక్కడ తన కరెన్సీని కూడా రిలీజ్ చేశారు. 
 
తాజాగా నిత్యానంద మరోసారి వార్తల్లో నిలిచారు. కైలాస పేరుతో ఆయన సృష్టించుకున్న ప్రత్యేక దేశం తరపున ఇద్దరు ప్రతినిధులు ఐక్యరాజ్య సమితి సమావేశాలకు హాజరయ్యారు. తనను తాను విజయ ప్రియ నిత్యానందగా పరిచయం చేసుకున్న ఓ మహిళా ప్రతినిధి.. నిత్యానందను భారత సర్కారు వేధింపులకు గురిచేస్తుందని ఆరోపించారు. 
 
జెనీవాలో జరిగిన సీఈఎస్‌సీఆర్ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. హిందువుల కోసం తొలి సార్వభౌమ దేశంగా కైలాసను నిత్యానందను ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. 
Nithyananda
 
హిందూ సంప్రదాయాలను, నాగరికతను ఆయన పునరుద్ధరిస్తున్నారని పేర్కొన్నారు. ఆ తర్వాత కైలాస నుంచి మరో ప్రతినిధి ఈఎన్ కుమార్ కూడా నిత్యానందకు మద్దతుగా కైలాస గొప్పతాన్ని గురించి మాట్లాడారు. ప్రస్తుతం ఈ వ్యవహారం చర్చకు దారితీసింది. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venky 77: వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో మల్లీశ్వరీ సీక్వెల్ !

Janhvi : రామ్ చరణ్, జాన్వీ కపూర్ పై పెద్ది కోసం పూణేలో సాంగ్ షూటింగ్

నాలుగు జన్మల కథతో మైథలాజికల్ చిత్రంగా గత వైభవ: ఎస్ఎస్ దుశ్యంత్

బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టికి షాకిచ్చిన బాంబే హైకోర్టు

KRamp: ఫ్లవర్ లాంటి లవర్ ఉంటే లైఫ్ సూపర్ రా అంటూ K-ర్యాంప్ గీతం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దీపావళి డ్రెస్సింగ్, డెకర్: ఫ్యాబ్ఇండియా స్వర్నిమ్ 2025 కలెక్షన్‌

ధ్యానంతో అద్భుతమైన ప్రయోజనాలు

రష్మిక మందన్న, ప్రముఖ క్రియేటర్‌లతో జతకట్టిన క్రాక్స్

గ్యాస్ట్రిక్ సమస్యలు వున్నవారు ఎలాంటి పదార్థాలు తీసుకోకూడదు?

బొబ్బర్లు లేదా అలసందలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments