Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మా దేశం దివాళీ తాసింది.. : పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్

Khawaja Asif
, ఆదివారం, 19 ఫిబ్రవరి 2023 (11:07 IST)
పాకిస్థాన్ రక్షణ మంత్రి, పీఎంఎల్ ఎన్ పార్టీ కీలక నేత ఖ్వాజా మొహ్మద్ ఆసిఫ్ కీలక ప్రకటన చేశారు. తమ దేశం దివాళా తీసిందని చెప్పారు ఈ మేరకు ఆయన ఓ సభలో ఈ వ్యాఖ్యలు చేయడంతో ఇవి సంచలంగా, చర్చనీయాంశంగా మారాయి.
 
"మనం ఇపుడు దివాళా తీసిన దేశంలో జీవిస్తున్నాం. పాకిస్థాన్ విదేశీ అప్పులు చెల్లించలేకపోతోంది. ఆర్థిక సంక్షోభంలో ఉందన్న వార్తలు మీరందరూ వినే ఉంటారు. కానీ, ఇది ఇప్పటికే జరిగిపోయింది. మనం దివాళా తీశాం. ఇపుడు మనం మళ్లీ మనకాళ్లపై నిలబడాలి. ఈ సమస్యకు అంతర్జాతీయ ద్రవ్యనిధి సాయం పరిష్కారం కాదు. అసలు పరిష్కారం మన దేశంలోనే ఉంది" అని అన్నారు. 
 
ఈ సందర్భంగా ఆయన గత ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు దేశంలో ఉగ్రవాదం వేళ్లూనుకుని పోవడానికి కారణం ఇమ్రాన్ ఖాన్ చర్యలేనిని ఆయన ఆరోపించారు. ఆయన ఆరంభించిన ఆట కారణంగా ఉగ్రవాదమే పాకిస్థాన్ గమ్యంగా మారిందని వ్యాఖ్యానించారు. 
 
ప్రస్తుతం పాకిస్థాన్ అసాధారణ స్థాయిలో ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది. కనీసావసరాల ధరలు ఆకాశాన్నంటడంతో ప్రజలు తీవ్ర అగచాట్లు పడుతున్నారు. ప్రస్తుతం దేశంలోని విదేశీ కరెన్సీ నిల్వలు మరోమూడు వారాల పాటు మాత్రమే దిగుమతులకు సరిపోతాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణాలో వైఎస్.షర్మిల ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు - అరెస్టు.. పాదయాత్రకు మళ్లీ బ్రేక్