Webdunia - Bharat's app for daily news and videos

Install App

విదేశాలకు పారిపోయిన నిత్యానంద.. కిడ్నాప్, రేప్ కేసు నమోదు కాగానే జంప్?

Webdunia
శుక్రవారం, 22 నవంబరు 2019 (10:33 IST)
వివాదాస్పద బాబా నిత్యానందపై కిడ్నాప్ కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నిత్యానంద దేశం వదలి విదేశాలకు పారిపోయాడని గుజరాత్ పోలీసులు వెల్లడించారు. నిత్యానంద తన అనుచరులైన సాధ్వీ ప్రణప్రియానంద, ప్రియతత్వ రిద్ది కిరణ్ అనే మహిళలు ఇద్దరు పిల్లలను అక్రమంగా నిర్బంధించారన్న ఆరోపణలతో వారిపై కేసు నమోదు చేశారు. 
 
మొత్తం నలుగురు పిల్లలను కిడ్నాప్ చేసి.. వారిని ఓ ఇంట్లో నిర్బంధించారని పోలీసులు తెలిపారు. వారిని బాల కార్మికులుగా మార్చి ఆశ్రమ కార్యకలాపాలకు ఉపయోగించుకుంటారని చెప్పారు. ఆ నలుగురు పిల్లలకు విముక్తి కల్పించామని.. వారి వాంగ్మూలం ఆధారంగానే నిత్యానందపై కేసులు నమోదు చేశామని తెలిపారు. కేసులో కీలక నిందితుడైన నిత్యానంద భారత్ తిరిగి రాగానే అరెస్ట్ చేస్తామని తెలిపారు.
 
అయితే ఓ రేప్ కేసులో నిత్యానందపై కర్ణాటకలో ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత ఆయన విదేశాలకు పారిపోయాడని అహ్మదాబాద్ ఎస్పీ ఆర్వీ అసారి చెప్పారు. నిత్యానందకు ఎక్కడికి పారిపోయి ఉంటాడో తెలుసుకోవాలని కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖను గుజరాత్ పోలీసులు కోరారు. అయితే హోంమంత్రిత్వ శాఖ మాత్రం గుజరాత్ పోలీసులు నంచి అధికారికంగా తమకెలాంటి విజ్ఞప్తి రాలేదని తెలిపింది. ప్రస్తుతానికైతే నిత్యానందకు సబంధించిన ఎలాంటి సమాచారం తమ వద్ద లేదని పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్లు బంద్ కు ఎగ్జిబిటర్లు పిలుపు - పర్సంటేజ్ లో తేడా తేల్చాలని నిర్మాతలు

ఏపీ సీఎం చంద్రబాబుకు బహుమతి ఇచ్చిన పూనమ్ కౌర్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

జలియాన్‌వాలా బాగ్ హత్యాకాండ కేసరి ఛాప్టర్ 2 తెలుగు లో రాబోతోంది

Kamlhasan: సిద్ధాంత పోరాటంగా థగ్ లైఫ్ యాక్షన్-ప్యాక్డ్ ట్రైలర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments