Webdunia - Bharat's app for daily news and videos

Install App

మద్దతు లేఖ ఇచ్చిన NDA మిత్రపక్షాలు: నెహ్రూ తర్వాత మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోడి

ఐవీఆర్
శుక్రవారం, 7 జూన్ 2024 (23:16 IST)
లోక్‌సభ ఎన్నికల్లో కూటమి విజయం సాధించిన నేపధ్యంలో NDA నాయకుడిగా నరేంద్ర మోదీని తదుపరి కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆహ్వానించారు. ఆదివారం సాయంత్రం 6 గంటలకు మోడీ తన కొత్త మంత్రివర్గం సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
 
రాష్ట్రపతి భవన్ నుండి వచ్చిన ప్రకటనలో శ్రీమతి ముర్ము ఇలా తెలిపారు. వివిధ మద్దతు లేఖల ఆధారంగా బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ కూటమి... కొత్తగా ఏర్పడిన 18వ లోక్‌సభలో మెజారిటీ మద్దతుని పొందే స్థితిలో ఉందని, సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగే స్థితిలో ఉందని పేర్కొన్నారు.
 
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత జవహర్‌లాల్ నెహ్రూ తర్వాత నరేంద్ర మోదీ మూడు పర్యాయాలు ప్రధానమంత్రి కానున్నారు. రాష్ట్రపతిని కలిసిన అనంతరం మోదీ మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఉదయం ఎన్‌డీఏ మిత్రపక్షాలన్నీ నన్ను నాయకుడిగా ఎన్నుకుని రాష్ట్రపతికి తెలియజేశాయి. ఆ తర్వాత రాష్ట్రపతి నన్ను పిలిచి ప్రధానిగా ప్రమాణం చేయాలన్నారు. ఆదివారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పినట్లు వెల్లడించారు. ఎన్డీయేకు మూడోసారి అధికారం ఇచ్చినందుకు ఓటర్లకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments