ప్రధాని మోదీపై బాలకృష్ణ విమర్శలు.. అవి ఏపీ ప్రజల ఆవేదన మాత్రమే

దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. విజయవాడలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేపట్టిన ఒక్కరోజు దీక్షలో బాలకృష్ణ మాట్లాడుతూ.. మోదీని శిఖండి

Webdunia
ఆదివారం, 22 ఏప్రియల్ 2018 (17:36 IST)
దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. విజయవాడలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేపట్టిన ఒక్కరోజు దీక్షలో బాలకృష్ణ మాట్లాడుతూ.. మోదీని శిఖండి అని, తరిమితరిమి కొడతామన్నారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తాను ప్రధాని మోదీ అభ్యంతరకర వ్యాఖ్యలు చేయలేదని తెలిపారు. 
 
ఏపీకి ప్రత్యేక హోదాపై రాష్ట్ర ప్రజల ఆగ్రహాన్ని, ఆవేదనను మాత్రమే వ్యక్తం చేశానని బాలకృష్ణ తెలిపారు. ఆదివారం గుంటూరు చిలకలూరి పేటలో బాలకృష్ణ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ మోదీపై తాను చేసిన వ్యాఖ్యలు.. ఏపీ ప్రజల మనోవేదన అన్నారు. 
 
కాస్టింగ్ కౌచ్‌పై బాలయ్య స్పందిస్తూ.. తెలుగు సినీ పరిశ్రమలో చెలరేగుతోన్న వివాదంపై పెద్దలు కూర్చొని మాట్లాడటం శుభపరిణామమన్నారు. కాగా కేఎస్‌ రవికుమార్ దర్శకత్వంలో సీకే ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై సీ కల్యాణ్‌ నిర్మించిన ''జై సింహ'' ఈ ఏడాది జనవరి 12న విడుదలైన ఈ సినిమా శనివారం వంద రోజులు పూర్తి చేసుకుంది. ఇందులో బాలకృష్ణ సరసన నయనతార, హరిప్రియ, నటాషా దొషీ నటించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రజనీకాంత్ చిత్రంలో విజయ్ సేతుపతి!!

'మన శంకర వరప్రసాద్ గారు' అందర్నీ సర్‌ప్రైజ్ చేస్తారు : అనిల్ రావిపూడి

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ G.O.A.T సినిమాకి బ్యాగ్రౌండ్ అందిస్తున్న మణిశర్మ

Aadi Pinisetty: బాలయ్య ముక్కు సూటి మనిషి, అల్లు అర్జున్ తో హలో హాయ్ అంతే.. : ఆది పినిశెట్టి

Shobhan Babu: సోగ్గాడు స్వర్ణోత్సవ పోస్టర్ రిలీజ్ చేసిన డి.సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

జుట్టుకు మేలు చేసే ఉల్లిపాయ నూనె.. మసాజ్ చేస్తే అవన్నీ పరార్

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

తర్వాతి కథనం
Show comments