మూడు లక్షల బ్యాగ్‌ను ఎత్తుకొని చెట్టుమీద కూర్చుంది..?

Webdunia
సోమవారం, 16 ఆగస్టు 2021 (09:42 IST)
ఉత్తరప్రదేశ్‌లో ఓ వింత సంఘటన జరిగింది. మామూలుగానే కోతులు చేసే పనులు చాలా విచిత్రంగా ఉంటాయి. వాటికి ఏదైనా దొరికితే తీసుకొని చెట్టెక్కి కూర్చుంటాయి. అలానే ఉత్తర ప్రదేశ్‌లోని హార్దోయి జిల్లాలోని సాంఢీ పోలిస్ స్టేషన్ పరిధిలో రోడ్డు పక్కన నిలిపి ఉన్న బైక్ నుంచి మూడు లక్షల బ్యాగ్‌ను ఎత్తుకొని వెళ్లి చెట్టుమీద కూర్చుంది. 
 
విషయం గమనించిన బైక్ యజమాని ఆశిష్ సింగ్‌ తన బ్యాగ్ ఇచ్చేయమని కోతిని బతిమిలాడాడు. కానీ, కోతి పట్టించుకోలేదు. వెంటనే ఆశిష్ సింగ్ దగ్గరలో ఉన్న సాంఢీ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. తన బైక్ నుంచి కోతి మూడు లక్షల రూపాయల బ్యాగ్ కొట్టేసిందని ఫిర్యాదు చేశాడు. 
 
అదే సమయంలో ఆ కోతి తన చేతిలోని డబ్బుల బ్యాగ్‌ను కింద పడేసింది. అక్కడే ఉన్న సెక్యూరిటి గార్డ్ ఆ డబ్బును తీసుకొని వెళ్లి పోలీస్‌స్టేషన్‌లో అప్పగించాడు. సెక్యూరిటీ గార్డ్ నిజాయితీని పోలీసులు మెచ్చుకున్నారు. దీనికి సంబందించిన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తండ్రి కూతురు సెంటిమెంట్ తో డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు ట్రైలర్

Sri Vishnu: విష్ణు విన్యాసం స్ట్రెస్ బస్టర్ లాగా ఉంటుంది : శ్రీ విష్ణు

Anupama: అనుపమ పరమేశ్వరన్ తో అగ్ర నిర్మాణ సంస్థ కొత్త మూవీ ప్రకటన

INCA: ఏప్రిల్ లో ముంబైలో ఘనంగా తొలి INCA అవార్డులు వేడుక

Chiranjeevi: సురేఖ నా భార్య మాత్రమే కాదు, నా బలం, నా అండ, నా ప్రశాంతత : చిరంజీవి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెరుగైన శ్వాసకోశ ఆరోగ్యం కోసం పిపెయిర్‌ను విడుదల చేసిన జైడస్

గోరువెచ్చని నీటిలో నిమ్మరసం వేసుకుని తాగితే?

హైబీపీ వున్నవారు ఈ పదార్థాలు తింటే...?

అలోవెరా జ్యూస్ తాగితే ఏం జరుగుతుంది?

హైదరాబాద్‌లో టిఏఎల్ హెల్త్ ఫెస్ట్ 2026 ను నిర్వహించిన టచ్-ఎ-లైఫ్ ఫౌండేషన్

తర్వాతి కథనం
Show comments