Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెదేపా మంత్రులు ఆడాళ్లో.. మగాళ్లో అర్థం కావట్లేదు : ఆర్కే. రోజా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అధికార టీడీపీ మంత్రులపై వైకాపా శాసనసభ్యురాలు ఆర్కే.రోజా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఏపీ మంత్రులు అట్టడుగుస్థాయికి దిగజారి తమ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై విమర

Webdunia
సోమవారం, 13 ఆగస్టు 2018 (15:26 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అధికార టీడీపీ మంత్రులపై వైకాపా శాసనసభ్యురాలు ఆర్కే.రోజా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఏపీ మంత్రులు అట్టడుగుస్థాయికి దిగజారి తమ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై విమర్శలు గుప్పిస్తున్నారని ఆరోపించారు. నిజంగా వారు మగవాళ్లో, ఆడవాళ్లో తెలియడం లేదంటూ ఈ నగరి ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
 
ఒంగోలులో ఆమె మాట్లాడుతూ, టీడీపీ నేతలు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని, తమకున్న అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్ సతీమణి భారతిని కేసుల్లో ఇరికించాలని చూస్తున్నారని ఆరోపించారు. ఓ కేసులో ఏడు సంవత్సరాల తర్వాత జగన్ భార్య భారతి పేరును చేర్చడమేంటని ప్రశ్నించిన ఆమె, ఓ కుట్ర ప్రకారం ఇదంతా జరుగుతోందని నిప్పులు చెరిగారు.
 
జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతో టీడీపీ పూర్తిగా కుమ్మక్కైపోయిందన్నారు. అందువల్లే టీడీపీ నేతలు అలా మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఇలాంటి వారికి ప్రజలు బుద్ధి చెప్పే రోజు దగ్గర్లోనే ఉందన్నారు. మీ ఇంట్లోని వాళ్లను కూడా ఇలాగే కోర్టుకులాగే పరిస్థితి వస్తుందన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఎం రత్నంపై ఫిర్యాదులు - 'హరిహర వీరమల్లు' రిలీజ్‌కు చిక్కులా?

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments