Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ మోడీ రెడ్డి... వైకాపా అధినేతకు పేరు పెట్టిన లోకేశ్

వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డికి ఏపీ మంత్రి నారా లోకేశ్ సరికొత్త పేరు పెట్టారు. ఇకపై జగన్ పేరును ఇకపై జగన్ మోడీ రెడ్డిగా మారిందనీ ఆయన చెప్పారు.

Webdunia
శుక్రవారం, 22 జూన్ 2018 (09:30 IST)
వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డికి ఏపీ మంత్రి నారా లోకేశ్ సరికొత్త పేరు పెట్టారు. ఇకపై జగన్ పేరును ఇకపై జగన్ మోడీ రెడ్డిగా మారిందనీ ఆయన చెప్పారు.
 
చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం తుమ్మిశిలో పర్యటించిన లోకేశ్ అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నాలుగేళ్లు ఏపీకి కేంద్ర సర్కారు ద్రోహం చేసిందని, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గురించి జగన్‌, పవన్‌ ఒక్క మాట కూడా మాట్లాడట్లేదని అన్నారు. 
 
కానీ, 68 యేళ్ల వయసులో మన కోసం, రాష్ట్ర ప్రజల కోసం అహర్నిశలు శ్రమిస్తున్న టీడీపీ అధినేత, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడునిపై పొద్దస్తమానం విమర్శల వర్షం గుప్పిస్తున్నారనీ ఆరోపించారు. 
 
మోడీపై విమర్శలు చేస్తే జైలుకు వెళ్లాల్సి వస్తుందని జగన్‌కు భయం పట్టుకుందని నారా లోకేశ్ విమర్శించారు. జగన్మోహన్‌ రెడ్డి పేరు మారిందని, ఇప్పుడు ఆయన పేరు జగన్‌ మోదీ రెడ్డి అని ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష పార్టీలు ఎన్ని కుట్రలు చేసినా వచ్చే ఎన్నికల్లో 25కి 25 లోక్‌సభ సీట్లు సాధిస్తామని లోకేశ్ ధీమా వ్యక్తంచేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments