Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ కారుకు.. అందులోని డబ్బుకు పార్టీకి నాకు సంబంధం లేదు : మంత్రి బాలినేని

Webdunia
గురువారం, 16 జులై 2020 (11:29 IST)
తమిళనాడు రాష్ట్రంలోని ఎళావూరు వద్ద రూ.5 కోట్లతో పట్టుబడిన కారుపై ఆంధ్రప్రదేశ్ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి వివరణ ఇచ్చారు. ఆ కారుకు, అందులోని డబ్బుకు పార్టీకి గానీ నాకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టంచేశారు. పైగా, తనకు తెలిసినంత వరకూ కారుపై ఉన్న స్టిక్కర్ ఒరిజినల్ కాదని, జిరాక్స్ కాపీ అని వ్యాఖ్యానించారు. 
 
ఆ వాహనం తమిళనాడులో రిజిస్టర్ అయిందని గుర్తు చేసిన ఆయన, స్టిక్కర్ ఫోటోస్టాట్ కాపీ అని, దీన్ని మీడియా వారు పరిశీలిస్తే, వారే గుర్తించగలరన్నారు. ఈ డబ్బు తనకు సంబంధించినది మాత్రం కాదని, అన్ని కోణాల్లోనూ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నట్టు చెప్పారు. తప్పు ఎవరిదైనా శిక్షించాలని డిమాండ్ చేశారు.
 
కాగా, ఆంధ్రప్రదేశ్ నుంచి తమిళనాడుకు వెళుతూ, చెన్నై సమీపంలో పట్టుబడిన ఓ కారులో రూ.5 కోట్ల నగదుతో పాటు.. బంగారాన్ని తమిళనాడు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కారుపై ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి స్టిక్కర్ ఉంది. దీంతో ఈ కారులో ఉన్నది వైకాపా అక్రమ సంపాదన అని, ఆ నగదును పొరుగు రాష్ట్రాలకు తరలిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో మంత్రి బాలినేని శ్రీనివాస్ వివరణ ఇచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గరివిడి లక్ష్మి గాయనే కాదు ఉద్యమమే ఆమె జీవితం.. ఆనంది కి ప్రశంసలు

ఏఎం రత్నంపై ఫిర్యాదులు - 'హరిహర వీరమల్లు' రిలీజ్‌కు చిక్కులా?

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments