Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లి విందు.. చపాతీపై ఉమ్మివేసి తయారు చేశాడు.. అరెస్ట్

Webdunia
సోమవారం, 22 ఫిబ్రవరి 2021 (18:12 IST)
chapati
పెళ్లింటే చాలా మందికి గుర్తొచ్చేది వింధు భోజనమే. పెళ్లికి వచ్చిన వారికి రకరకాల పదార్థాలతో వడ్డిస్తారు. కానీ ఇప్పుడు చెప్పేది వింటే ఇకపై పెళ్లిలో భోజనం చేయాలంటేనే ఒకటికి పది సార్లు ఆలోచిస్తారు. ఓ పెళ్లి విందులో ఏర్పాటు చేసిన చపాతీల్లో.. ఆ చపాతీలు తయారు చేసే వ్యక్తి ప్రతీ చపాతీపై ఉమ్మి వేసి తయారు చేశాడు.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఘటన జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో బయటపడగా.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇలా ఉమ్మివేసి చపాతీ చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అసలే కరోనా కాలం. జనాలు మాస్కులు, శానిటైజర్లు వాడుతున్న తరుణంలో తీసుకునే ఆహారంలో ఇలాంట గలీజు పని చేశాడు. 
 
వివరాల్లోకి వెళితే.. మీరట్‌లో ఓ పెళ్లితంతు ఘనంగా జరిగింది. అక్కడికి వచ్చిన అతిథుల కోసం ఓ వ్యక్తి తందూరీ రోటీలు తయారు చేస్తూ ఉమ్మి వేస్తున్నాడు. చపాతీలను చాక చాక్యంగా తిప్పుతూ ఒకదానిమీద మరొకటి పేర్చి ప్రతీ చపాతీపై ఉమ్మి వేశాడు. అతడు చేసిన పనిని ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. ఇంకేముంది.. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
 
దీనిపై దర్యాప్తు చేపట్టిన మీరట్ పోలీసులు.. ఈ పనిని మీరట్‌కు చెందిన సోహైల్ చేసినట్లు గుర్తించారు. వెంటనే అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా.. తానెప్పుడు చపాతీలు చేయలేదని.. తనకేమి తెలియన్నాడు. వీడియో చూపించి అడుగగా.. ఆ వీడియోలో ఉన్నది తాను కాదని అంటున్నాడు. దీంతో ఆ వ్యక్తి మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు పోలీసులు భావిస్తున్నారు.

సంబంధిత వార్తలు

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments