Webdunia - Bharat's app for daily news and videos

Install App

పంజాబ్‌లో షాకింగ్ ఘటన: ట్రాక్టర్‌పై స్టంట్‌.. వ్యక్తి మృతి

Webdunia
సోమవారం, 30 అక్టోబరు 2023 (18:51 IST)
Tractor
పంజాబ్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ట్రాక్టర్‌పై స్టంట్‌ చేసేందుకు ప్రయత్నించి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లాలో శనివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. 29 ఏళ్ల సుఖ్‌మన్‌దీప్ సింగ్ స్థానిక క్రీడా కార్యక్రమంలో పాల్గొన్నాడు. 
 
ఈవెంట్‌లో భాగంగా సుఖ్‌మన్‌దీప్ సింగ్ ట్రాక్టర్ స్టంట్ చేయడానికి సిద్ధమయ్యాడు. ముందుగా ఇంజన్ స్టార్ట్ చేసి ట్రాక్టర్ ముందు రెండు చక్రాలను పైకి లేపారు. ఇంజన్ ఆన్‌లోనే ఉండడంతో అటూ ఇటూ తిరగడం ప్రారంభించింది. ప్రమాదకరంగా వెళ్తున్న ట్రాక్టర్‌పై ఎక్కేందుకు సుఖ్‌మన్‌దీప్‌ సింగ్‌ ఎంతో ఉత్సాహంగా ప్రయత్నించాడు. 
 
ఒకసారి విఫలమై కిందపడిపోయాడు. వెంటనే ట్రాక్టర్ అతనిపై నుంచి వెళ్లింది. సుఖ్‌మన్‌దీప్ సింగ్ లేవడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. చివరికి ప్రాణాలు కోల్పోయాడు.
 
 ముందు రెండు చక్రాలు ఎత్తుగా ఉన్న ట్రాక్టర్ ప్రమాదకరంగా తిరగడంతో సుఖ్‌మన్‌దీప్ సింగ్ దానిపైకి ఎక్కేందుకు ప్రయత్నించి కిందపడిపోయాడు. ట్రాక్టర్ అతడిపై నుంచి దూసుకెళ్లింది.
 
 స్థానికులు సుఖ్‌మన్‌దీప్‌ సింగ్‌ను ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గుమ్మడికాయ కొట్టిన గేమ్ ఛేంజర్ - ఫ్యాన్స్ ఫిదా

అదే ఫీల్డ్ లో వర్క్ చేయడం ఆనందంగా వుంది : డార్లింగ్ ప్రొడ్యూసర్ చైతన్య రెడ్డి

అల్లు శిరీష్ బడ్డీ సినిమా నుంచి ఫీల్ ఆఫ్ బడ్డీ రిలీజ్

ప్రేక్షకుల మధ్య విజయ్ ఆంటోనీ యాక్షన్ ఫిల్మ్ తుఫాన్ ట్రైలర్ ఇంట్రడక్షన్

మిస్టర్ బచ్చన్ లో రవితేజ, భాగ్యశ్రీ బోర్సే పై సితార్ సాంగ్ షూట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పప్పు ఎందుకు తినాలో తెలుసా?

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments