పంజాబ్‌లో షాకింగ్ ఘటన: ట్రాక్టర్‌పై స్టంట్‌.. వ్యక్తి మృతి

Webdunia
సోమవారం, 30 అక్టోబరు 2023 (18:51 IST)
Tractor
పంజాబ్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ట్రాక్టర్‌పై స్టంట్‌ చేసేందుకు ప్రయత్నించి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లాలో శనివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. 29 ఏళ్ల సుఖ్‌మన్‌దీప్ సింగ్ స్థానిక క్రీడా కార్యక్రమంలో పాల్గొన్నాడు. 
 
ఈవెంట్‌లో భాగంగా సుఖ్‌మన్‌దీప్ సింగ్ ట్రాక్టర్ స్టంట్ చేయడానికి సిద్ధమయ్యాడు. ముందుగా ఇంజన్ స్టార్ట్ చేసి ట్రాక్టర్ ముందు రెండు చక్రాలను పైకి లేపారు. ఇంజన్ ఆన్‌లోనే ఉండడంతో అటూ ఇటూ తిరగడం ప్రారంభించింది. ప్రమాదకరంగా వెళ్తున్న ట్రాక్టర్‌పై ఎక్కేందుకు సుఖ్‌మన్‌దీప్‌ సింగ్‌ ఎంతో ఉత్సాహంగా ప్రయత్నించాడు. 
 
ఒకసారి విఫలమై కిందపడిపోయాడు. వెంటనే ట్రాక్టర్ అతనిపై నుంచి వెళ్లింది. సుఖ్‌మన్‌దీప్ సింగ్ లేవడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. చివరికి ప్రాణాలు కోల్పోయాడు.
 
 ముందు రెండు చక్రాలు ఎత్తుగా ఉన్న ట్రాక్టర్ ప్రమాదకరంగా తిరగడంతో సుఖ్‌మన్‌దీప్ సింగ్ దానిపైకి ఎక్కేందుకు ప్రయత్నించి కిందపడిపోయాడు. ట్రాక్టర్ అతడిపై నుంచి దూసుకెళ్లింది.
 
 స్థానికులు సుఖ్‌మన్‌దీప్‌ సింగ్‌ను ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పిల్లలను వదిలేశాడు.. ఆ పిల్లల తల్లిని అతని సోదరుడు వేధించాడు.. పవన్‌పై పూనమ్ ఫైర్

క్యాస్టింగ్ కౌచ్‌పై మెగాస్టార్ చిరంజీవి కామెంట్స్ .. ఇండస్ట్రీ అద్దం లాంటిది

స్పిరిట్ చిత్రంలో ప్రభాస్‌తో మెగాస్టార్ చిరంజీవి నటిస్తారా?

అనిల్ రావిపూడికి ఖరీదైన బహుమతి ఇచ్చిన మెగాస్టార్

'మన శంకరవరప్రసాద్ గారు' మూవీ నుంచి అదిరిపోద్ది సంక్రాంతి ఫుల్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో టీ తాగితే ఏమవుతుంది?

సెకండరీ గ్లకోమాకు విస్తృతమైన స్టెరాయిడ్ వాడకం కారణం: వైద్యులు

బొప్పాయి తింటే లాభాలతో పాటు నష్టాలు కూడా వున్నాయి, ఏంటవి?

ఈ సీజన్‌లో వింటర్ ఫ్లూ, న్యుమోనియాను దూరంగా ఉంచడానికి 5 ముఖ్యమైన చిట్కాలు

సెయింట్ లూయిస్‌లో నాట్స్ ఉచిత వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments