Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముగిసిన పోలింగ్ : హుజూర్ నగర్‌లో ఓటర్ల మూడ్ ఏంటి?

Webdunia
సోమవారం, 21 అక్టోబరు 2019 (17:42 IST)
మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు.. తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానానికి నిర్వహించిన ఉప ఎన్నిక పోలింగ్ సోమవారం ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటలకు ముగిసింది. అయితే, ఐదు గంటల లోపు వచ్చి వరుసలో నిలబడినవారికి ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కల్పిస్తున్నట్టు పోలింగ్ అధికారులు వెల్లడించారు. 
 
మరోవైపు,పోలింగ్ ముగిసే సమయానికి హుజూర్‌నగర్‌ ఉపఎన్నికల 80 శాతానికి పైగా నమోదైంది. మొత్తం నియోజకవర్గంలో 302 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటన్నిటిలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఇప్పటికే లైన్‌లో నిలబడి ఉన్నవారంతా ఓటు హక్కు వినియోగించుకుంటే ఓటింగ్ శాతం మరింత పెరిగే అవకాశముంది. ఇక 2014లో 81.14 శాతం, 2018లో 85.96 శాతం ఓటింగ్ నమోదైంది. తాజాగా ఈ ఉపఎన్నికలో కూడా అంతే స్ధాయిలో నమోదయ్యే అవకాశాలున్నట్టు భావిస్తున్నారు. పైగా, ఈ అసెంబ్లీ స్థానం ఓటర్ల మూడ్ మాత్రం విపక్ష పార్టీ కాంగ్రెస్ వైపే మొగ్గు చూపినట్టు సమాచారం. 
 
మరోవైపు, మహారాష్ట్ర అసెంబ్లీ స్థానానికి ఉన్న 288 సీట్లతో పాటు.. హర్యానాలోని 90 అసెంబ్లీ సీట్లకు కూడా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ముఖ్యంగా, మహారాష్ట్రలో ఓటు హక్కును వినియోగించుకునేందుకు బాలీవుడ్ సెలెబ్రిటీలు, ప్రముఖులు క్యూకట్టారు. పైగా, ఈ రెండు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉండగా, తిరిగి నిలబెట్టుకునేందుకు ప్రధాని మోడీతో పాటు.. పార్టీ చీఫ్ అమిత్ షాలు సుడిగాలి ఎన్నికల ప్రచారం నిర్వహించిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

Chiru: 25 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సంతకం తీసుకున్న శేఖర్ కమ్ముల

Pawan: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన నారాయణ మూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

తర్వాతి కథనం
Show comments