Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహారాష్ట్ర - హర్యానాల్లో కాషాయం రెపరెపలు.. కనిపించని హస్తవాసి

Webdunia
గురువారం, 24 అక్టోబరు 2019 (08:59 IST)
మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలను నిజం చేసేలా బీజేపీ దూసుకెళ్తోంది. రెండు రాష్ట్రాల్లోనూ మళ్లీ అధికారం నిలబెట్టుకునే దిశగా ఆధిక్యం ప్రదర్శిస్తోంది. గురువారం ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగా.. తొలి రౌండ్‌ నుంచే రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీ కూటమి కాంగ్రెస్‌ కూటమిపై ఆధిక్యంలో కొనసాగుతోంది. మహారాష్ట్రలో బీజేపీ పక్షాలు 161 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా.. కాంగ్రెస్ కూటమి 47 చోట్ల, ఇతరులు 14 చోట్ల ఆధిక్యంలో ఉన్నారు. 
 
ఇకపోతే, హర్యానాలో బీజేపీ కూటమి 52 స్థానాల్లోనూ, కాంగ్రెస్ 11 స్థానాల్లోనూ ఆధిక్యంలో ఉన్నాయి. హర్యానాలో జేజేపీ గణనీయంగా ఓట్లు చీల్చినా కాంగ్రెస్‌కు ఊరట లభించలేదు. జాట్‌ ఓట్లు గట్టెక్కిస్తాయన్న కాంగ్రెస్‌ అంచనాలు తలకిందులయ్యాయి. హర్యానాలో మోదీ జాతీయవాద ప్రచారం బీజేపీకి లాభించినట్టు కనిపిస్తోంది.
 
288 అసెంబ్లీ సీట్లున్న మహారాష్ట్ర శాసనసభకు 98 సీట్లున్న హర్యానా రాష్ట్ర అసెంబ్లీతోపాటు.. దేశ వ్యాప్తంగా ఖాళీగా ఉన్న అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 21వ తేదీన ఎన్నికలు, ఉప ఎన్నికల పోలింగ్ జరిగిన విషయం తెల్సిందే. వీటి ఓట్ల లెక్కింపు గురువారం ఉదయం 8 గంటలకు చేపట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajinikanth: రజనీకాంత్ కూలీ సిద్ధమవుతోంది - ఓటీటీ కన్ ఫామ్స్

గాలి కిరీటీరెడ్డి జూనియర్ చిత్రానికి మిగిలింది రెండు రోజులే

హాట్ కేకుల్లా 'వీరమల్లు' : బుక్‌ మై షో క్రాష్? - ఆంధ్రాలో రూ.1000 - తెలంగాణాలో టిక్కెట్ ధర రూ.600

ZEE5 లో ఆడియెన్స్‌ను అల‌రిస్తూ దూసుకెళ్తోన్న భైర‌వం

సోమిరెడ్డి కోడలు శృతి రెడ్డి తో కలిసి డిజిటల్ క్లాస్ రూంను ప్రారంభించిన మంచు లక్ష్మి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం
Show comments