Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు : కాషాయ కూటమి ప్రభంజనం

Webdunia
గురువారం, 24 అక్టోబరు 2019 (09:28 IST)
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు గురువారం ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమయ్యాయి. ఈ ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని బీజేపీ కూటమి ఆధిక్యంలో కొనసాగుతోంది. మొత్తం 288 అసెంబ్లీ సీట్లకుగాను బీజేపీ కూటమి 158 కోట్ల, కాంగ్రెస్ కూటమి 76 చోట్ల, ఇతరులు 20 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 
 
ఈ ట్రెండ్ సరళిని బట్టి చూస్తే కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి వెనుకంజలో ఉంది. ప్రస్తుత ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ నేతృత్వంలోని కూటమి తన హవా చాటుతోంది. మహారాష్ట్ర ఎన్నికల్లో వివిధ పార్టీల నుంచి బరిలోకి దిగిన దిగ్గజ నేతలు ముందంజలో కొనసాగుతున్నారు. 
 
బీజేపీకి చెందిన పంకజా ముండే... పర్లీ సీటులో తన సత్తా చాటుతున్నారు. భోకర్ నుంచి పోటీకి దిగిన అశోక్ చవాన్(కాంగ్రెస్) లీడ్‌లో కొనసాగుతున్నారు. అదేవిధంగా వర్లీ నుంచి పోటీ చేసిన ఉద్దవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే ముందంజలో ఉన్నారు. శివసేన నుంచి పోటీకి దిగిన ఏకనాథ్ షిండే మొదటి రౌండ్‌ నుంచి తన హవా కొనసాగిస్తున్నారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments