Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాపై దుష్ప్రచారం చేసారని డీజీపీకి ఫిర్యాదు చేసా: లక్ష్మీ పార్వతి

Webdunia
సోమవారం, 15 ఏప్రియల్ 2019 (18:51 IST)
తన ప్రతిష్ఠను దెబ్బతీసేలా కోటి అనే వ్యక్తి తనపై సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేస్తున్నారని ఎన్టీఆర్ సతీమణి, వైకాపా నేత లక్ష్మీపార్వతి ఆరోపించారు. గౌరవప్రదమైన స్థాయిలో ఉన్న తనను అగౌరవపరుస్తూ  విమర్శలు చేస్తున్నారని అన్నారు. అందుకోసమే తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డిని కలిసి ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. సదరు వ్యక్తిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. 
 
డీజీపీని కలిసిన అనంతరం లక్ష్మీపార్వతి మీడియాతో మాట్లాడారు. ఏప్రిల్ 4వ తేదీన తనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ ఓ టీవీ ఛానల్‌, సోషల్‌ మీడియాలో తన వ్యక్తిత్వాన్ని కోటి అనే వ్యక్తి కించపరిచారని ఆమె మండిపడ్డారు. అతనితో పాటు ఆ కార్యక్రమాన్ని ప్రసారం చేసిన మీడియా ఛానల్‌‌, యాంకర్లపై చర్యలు తీసుకోవాలని కూడా డీజీపీని కోరినట్లు లక్ష్మీపార్వతి తెలిపారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments