Webdunia - Bharat's app for daily news and videos

Install App

లంచం ఇవ్వలేను.. దానికి బదులు ఎద్దును ఇస్తాను.. తీసుకోండి..

Webdunia
శనివారం, 11 మార్చి 2023 (09:25 IST)
Ox
లంచం ఇవ్వలేను.. దానికి బదులు ఎద్దును ఇస్తాను అంటూ ఓ రైతు కార్యాలయానికి ఎద్దును తోలుకొచ్చాడు. ఈ ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై సొంత జిల్లా అయిన హవేరిలో సవనూర్ మున్సిపాలిటీకీ చెందిన ఎల్లప్ప రానోజీ అనే రైతు మున్సిపల్ రికార్డుల్లో మార్పు కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే సంబంధిత అధికారి లంచం డిమాండ్ చేశాడు. 
 
లంచం సమర్పించినా పని కాలేదు. అంతేగాకుండా ఆ అధికారి కూడా బదిలీ అయ్యాడు. దీంతో మళ్లీ కథ మొదటికి వచ్చింది. కొత్తగా వచ్చిన అధికారి కూడా లంచం ఇవ్వాలన్నాడు. ఇక చేసేది లేక రైతు ఎల్లప్ప తనకున్న ఎద్దుల్లో ఒకదానిని లంచంగా కార్యాలయానికి తీసుకువచ్చి.. డబ్బులకు బదులుగా ఎద్దును లంచంగా తీసుకోవాలని బతిమాలాడు. దీంతో కార్యాలయంలో ఒక్కసారిగా కలకలం రేగింది. 
 
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో లంచం పై అధికారులు స్పందించారు. లంచం అడిగిన అధికారులకు షోకాజ్ నోటీసు జారీ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మదరాసి నుంచి శివకార్తికేయన్ లవ్ ఫెయిల్యూర్ యాంథమ్

మిత్ర మండలి నుంచి రెండవ గీతం స్వేచ్ఛ స్టాండు విడుదల

భగవత్ కేసరి , 12th ఫెయిల్ ఉత్తమ చిత్రం; షారుఖ్ ఖాన్, విక్రాంత్ మాస్సే ఉత్తమ నటుడి అవార్డు

జాతీయ చలన చిత్ర అవార్డులు - ఉత్తమ చిత్రంగా 'భగవంత్ కేసరి'

Satyadev: మత్స్యకారుల బతుకుపోరాటంగా అరేబియా కడలి ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments