లంచం ఇవ్వలేను.. దానికి బదులు ఎద్దును ఇస్తాను.. తీసుకోండి..

Webdunia
శనివారం, 11 మార్చి 2023 (09:25 IST)
Ox
లంచం ఇవ్వలేను.. దానికి బదులు ఎద్దును ఇస్తాను అంటూ ఓ రైతు కార్యాలయానికి ఎద్దును తోలుకొచ్చాడు. ఈ ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై సొంత జిల్లా అయిన హవేరిలో సవనూర్ మున్సిపాలిటీకీ చెందిన ఎల్లప్ప రానోజీ అనే రైతు మున్సిపల్ రికార్డుల్లో మార్పు కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే సంబంధిత అధికారి లంచం డిమాండ్ చేశాడు. 
 
లంచం సమర్పించినా పని కాలేదు. అంతేగాకుండా ఆ అధికారి కూడా బదిలీ అయ్యాడు. దీంతో మళ్లీ కథ మొదటికి వచ్చింది. కొత్తగా వచ్చిన అధికారి కూడా లంచం ఇవ్వాలన్నాడు. ఇక చేసేది లేక రైతు ఎల్లప్ప తనకున్న ఎద్దుల్లో ఒకదానిని లంచంగా కార్యాలయానికి తీసుకువచ్చి.. డబ్బులకు బదులుగా ఎద్దును లంచంగా తీసుకోవాలని బతిమాలాడు. దీంతో కార్యాలయంలో ఒక్కసారిగా కలకలం రేగింది. 
 
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో లంచం పై అధికారులు స్పందించారు. లంచం అడిగిన అధికారులకు షోకాజ్ నోటీసు జారీ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashi: ది రెడ్ బ్యాగ్ చిత్రంలో సావిత్రి అనే పవర్ ఫుల్ పాత్రలో రాశీ

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ సినిమాకు సుధీర్ జోకర్ అనే టైటిల్ ఖరారు

Peddi trailer: మూడు విభిన్న క్రీడలతో హీరోగా ఎదిగిన కథతో పెద్ది ట్రైలర్

Seiyaan: శివకార్తికేయన్, కమల్ హాసన్ చిత్రం సెయాన్ నేడు ప్రారంభం

సినిమా బండి త‌ర్వాత నటుడిగా కెరీర్ పూర్తిగా మారింది: రాగ్ మ‌యూర్‌

తర్వాతి కథనం
Show comments