Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోడీ కల్లిబొల్లి మాటలు కడుపు నింపవు : సోనియా గాంధీ

ప్రధాని నరేంద్ర మోడీ ఊకదంపుడు ప్రచారంతో ప్రజల కడపు నిండదని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ వ్యాఖ్యానించారు. ఈనెల 12వ తేదీన జరుగనున్న కర్ణాటక ఎన్నికల పోలింగ్‌ కోసం ఎన్నికల ప్రచారం గురువారం సాయంత్రంతో

Webdunia
బుధవారం, 9 మే 2018 (10:35 IST)
ప్రధాని నరేంద్ర మోడీ ఊకదంపుడు ప్రచారంతో ప్రజల కడపు నిండదని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ వ్యాఖ్యానించారు. ఈనెల 12వ తేదీన జరుగనున్న కర్ణాటక ఎన్నికల పోలింగ్‌ కోసం ఎన్నికల ప్రచారం గురువారం సాయంత్రంతో ముగియనుంది. దీంతో సోనియా గాంధీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
 
ఈ ప్రచారంలో భాగంగా, విజయపురలో జరిగిన బహిరంగ సభలో ఆమె పాల్గొని ప్రసంగిస్తూ, రాష్ట్రంలో కరువు పరిస్థితిపై మోడీని సీఎం సిద్ధరామయ్య కలవాలనుకుంటే అపాయింట్‌మెంట్ ఇవ్వలేదన్నారు. కర్ణాటకను దేశంలో నెంబర్‌వన్‌గా అభివృద్ధి చేసింది కాంగ్రెస్సేనని ఆమె గుర్తుచేశారు. మోడీ గొప్ప వక్త అన్న సోనియా… ఆయన మాటలు దేశంలో ఎవరి కడుపు నింపబోవన్నారు. 
 
అంతకుముందు మోడీ కూడా విజయపుర జిల్లాలోనే ప్రచార ర్యాలీలో పాల్గొన్నారు. కొప్పాల్‌లోనూ ప్రచారం చేశారు. కన్నడ రైతుల ఘోష కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టడంలేదని మోడీ ఆరోపించారు. పంటకు అయ్యే ఖర్చుపై ఒకటిన్నర రెట్లు మద్దతు ధర ఇచ్చేలా… కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుందన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అడివి శేష్, మృణాల్ ఠాకూర్ చిత్రం డకాయిట్ - ఏక్ ప్రేమ్ కథ

RGV: సెన్సార్ బోర్డు కాలం చెల్లిపోయింది.. అసభ్యత వుండకూడదా? రామ్ గోపాల్ వర్మ

మనమంతా కలిసి తెలుగు సినిమాను కాపాడుకోవాలి - నిర్మాత ఎస్ కేఎన్

ఫోక్ యాంథమ్ తో ఆకట్టుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అదితి శంకర్

తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించిన థాంక్యూ డియర్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments