Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్ష పీఠం ఆ సామాజిక వర్గానికేనట...

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా ఉన్న వైజాగ్ ఎంపీ కంభంపాటి హరిబాబు తన పదవికి రాజీనామా చేశారు. దీంతో ఆ పదవిని భర్తీ చేసే పనిలో బీజేపీ అధినాయకత్వం నిమగ్నమైంది. అదేసమయంలో హరిబాబుకు బీజేపీ జాతీ

Webdunia
బుధవారం, 18 ఏప్రియల్ 2018 (18:27 IST)
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా ఉన్న వైజాగ్ ఎంపీ కంభంపాటి హరిబాబు తన పదవికి రాజీనామా చేశారు. దీంతో ఆ పదవిని భర్తీ చేసే పనిలో బీజేపీ అధినాయకత్వం నిమగ్నమైంది. అదేసమయంలో హరిబాబుకు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా నియమించింది.
 
నిజానికి పార్టీ జాతీయ నాయకత్వం సూచనలకు అనుగుణంగా ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు తన బాధ్యతల నుంచి తప్పుకున్నారు. దీంతో ఆయన స్థానంలో కాపు సామాజిక వర్గానికి చెందిన నేతకు పార్టీ పగ్గాలు అప్పచెప్పనున్నట్టు సమాచారం. 
 
పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడి పేరును సైతం ఖరారు చేశారని, నేడో రేపో ప్రకటించనున్నారని జాతీయస్థాయిలోని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇకపోతే, బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్ష పదవికి తుది రేసులో కాపు సామాజిక వర్గానికి చెందిన ముగ్గురు నేతలు మిగిలినట్టు సమాచారం. సోము వీర్రాజు, పైడికొండల మాణిక్యాలరావు, కన్నా లక్ష్మీనారాయణల పేర్లను అధినాయకత్వం పరిశీలించినట్టు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments