Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్ కొత్త పెళ్లి జంటకు ఏకే-47 గిఫ్ట్.. వీడియో వైరల్

Webdunia
శనివారం, 28 నవంబరు 2020 (14:06 IST)
పాకిస్థాన్‌లో ఓ పెళ్లి జంట ఏకే-47ను బహుమతిగా పొందింది. పాకిస్థాన్‌కి చెందిన ఒక జంట మాత్రం వెరైటీ బహుమతిని అందుకున్నారు. ఆ జంటకు ఒక మహిళ ఎకె47 రైఫిల్ బహుమతిగా ఇచ్చింది. ఆ బహుమతి చూసి అక్కడి వారంతా ఆశ్చర్యపోయారు.

కాగా, ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌లలో వైరల్‌గా మారింది. 30 సెకన్ల వ్యవధి గల ఈ వీడియోలో సదరు మహిళ వరుడికి ఏకే-47 రైఫిల్‌ను బహుమతిగా ఇవ్వడాన్ని చూడవచ్చు. అయితే, వరుడు మాత్రం ఏకే-47 బహుమతిని చూసి ఏ మాత్రం ఆశ్చర్యపోకుండా ముఖం మీద చిరునవ్వుతో దాన్ని అందుకోవడం గమనార్హం. 
 
కాగా, ఈ వీడియోను ''వివాహ బహుమతిగా కలాష్నికోవ్ రైఫిల్" అనే ట్యాగ్ లైన్‌తో ట్విట్టర్లో షేర్ చేశారు. వైరల్ అవుతున్న ఈ వీడియోని పరిశీలిస్తే వివాహం పాకిస్థాన్‌లో జరిగినట్లు తెలుస్తోంది. ట్విట్టర్‌లో వైరల్ అయిన ఈ పోస్టును ఇప్పటివరకు 1.88 లక్షల మందికి పైగా చూడగా... 2.5 వేల మంది లైక్స్ ఇచ్చారు. వీడియోను చూసిన కొందరు నెటిజన్లు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

జలియాన్‌వాలా బాగ్ హత్యాకాండ కేసరి ఛాప్టర్ 2 తెలుగు లో రాబోతోంది

Kamlhasan: సిద్ధాంత పోరాటంగా థగ్ లైఫ్ యాక్షన్-ప్యాక్డ్ ట్రైలర్ రిలీజ్

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కోసం కూడా కథలు సిద్ధం చేశాం : డైరెక్టర్ విజయ్ కనకమేడల

నార్నే నితిన్, వేగేశ్న సతీష్ కాంబినేషన్లో శ్రీ శ్రీ శ్రీ రాజావారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments