గురు, శని గ్రహాలు ఆకాశంలో అలా కలుస్తాయట.. భారత్‌లో సాయంత్రం 6.30 నుంచి..?

Webdunia
సోమవారం, 21 డిశెంబరు 2020 (12:10 IST)
Jupiter-Saturn
డిసెంబర్ 21వ తేదీ (సోమవారం) సాయంత్రం రెండు గ్రహాలు ఒకదానినొకటి దాటి వెళతాయి. గురు, శని ఈ రెండు గ్రహాలు ఒక దానినొకటి దాటుతూ, ఒక చోట కలిసిపోయినట్లు కనిపిస్తాయి. అప్పుడు మన కంటికి పెద్ద వెలుగు కనిపిస్తుంది. రెండు గ్రహాలు ఒకే కక్ష్యలో (డబుల్ ప్లానెట్) ఉన్నట్లు కనిపిస్తాయి.
 
డిసెంబర్ నెలలో క్రిస్మస్ సమయంలో ఈ అద్భుతం జరగబోతుండడంతో, రెండు వేల సంవత్సరాల క్రితం ఆకాశంలో కనిపించిన బ్రహ్మాండమైన కాంతి ఇదే అయి ఉంటుందని కొందరు భావిస్తున్నారు. దీన్ని 'స్టార్ ఆఫ్ బెత్లెహం' అంటారు. ఖగోళ శాస్త్రం మీద ఆసక్తి ఉన్నవారు, నక్షత్రాలను, గ్రహాలను పరిశీలించేవారు ఆకాశంలో ఈ కలయికను వీక్షించవచ్చు. భారత్‌లో సాయంత్రం 6.30 నుంచి 7.30 మధ్యలో ఇది కనిపించే అవకాశం ఉందని ఖగోళ నిపుణులు చెబుతున్నారు.
 
సాయంత్రం పూట ఆకాశం వైపు చూస్తే.. ఆ రెండు గ్రహాలు దగ్గరగా వస్తున్న సంగతి తెలుస్తుంది. వాతావరణం ఎప్పుడు, ఎలా మారుతుందో తెలీదు కాబట్టి వెంటనే చూస్తే మేలు. మంచి అవకాశం కోల్పోకుండా ఉంటాం" అని యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రానమీకి చెందిన డా. కరోలిన్ క్రాఫోర్డ్ తెలిపారు. సాయంత్రం సూర్యుడు అస్తమించగానే ఆకాశంలో నైరుతి దిశగా ఈ రెండు గ్రహాలనూ చూడవచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వీధికుక్కలు దేశంలో ఎవరిని కరిచినా నన్నే నిందిస్తున్నారు : అక్కినేని అమల

సోషల్ మీడియాలో కీర్తి సురేష్ మార్ఫింగ్ ఫోటోలు... బోరుమంటున్న నటి

మీకు దణ్ణం పెడతా, నేను సన్యాసం తీసుకోవట్లేదు: రేణూ దేశాయ్ (video)

Joy Crizildaa: నీకు దమ్ముంటే డీఎన్ఏ టెస్టుకు రావయ్యా.. మాదంపట్టికి జాయ్ సవాల్

NC24: నాగ చైతన్య, మీనాక్షి చౌదరి చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments