Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్పత్రిలో పడకపై జయలలిత ఎలా ఉన్నారు.. డ్యూటీ డాక్టర్ ఏం చెప్పారు?

Webdunia
బుధవారం, 30 జనవరి 2019 (08:52 IST)
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత అనారోగ్యం కారణంగా గత 2016 సంవత్సరం డిసెంబరు 5వ తేదీన చనిపోయారు. ఈమె దాదాపు 75 రోజుల పాటు చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొంది చివరకు ప్రాణాలు విడిచారు. ఆ సమయంలో జయలలిత ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి చనిపోయే ముందు రోజైన డిసెంబరు 4వ తేదీ వరకు డ్యూటీ డాక్టరుగా ఉన్న శిల్ప తాజాగా సంచలన విషయాన్ని వెల్లడించారు. 
 
అపోలో ఆస్పత్రిలో జయలలిత చికిత్స పొందుతున్నసమయంలో ఆమె మానసికస్థితి అస్థిరంగా ఉండేదని, పలు సందర్భాల్లో ఒంటరిగా ఉండేందుకే ఎక్కువగా ఇష్టపడేవారని ఆమెకు చికిత్స చేసిన డాక్టర్‌ శిల్ప వెల్లడించారు. ఈ మేరకు జయ మృతిపై విచారణ జరుపుతున్న జస్టిస్‌ ఆర్ముగస్వామి కమిటీ ఎదుట ఆమె సాక్ష్యమిచ్చారు. కొన్ని సందర్భాల్లో జయలలిత నవ్వుతూ ఉండేవారని, మరికొన్ని సమయాల్లో 'నన్ను ఒంటరిగా ఉండనివ్వండి' అంటూ కసురుకునేవారని తెలిపింది. కాగా, జయలలిత అనారోగ్యం కారణంగా 2016 సెప్టెంబరు 22వ తేదీన ఆస్పత్రిలో చేరారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments