చంద్రయాన్-2పై ఆశలు గల్లంతు...భారతీయుల స్వప్నాలే మాకు స్ఫూర్తి... ఇస్రో

Webdunia
బుధవారం, 18 సెప్టెంబరు 2019 (09:14 IST)
చంద్రుడు దక్షిణ ధృవం అధ్యయనం కోసం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో పంపిన చంద్రయాన్-2 ప్రాజెక్టు చివరిక్షణంలో మొరాయించింది. ఇందులో అమర్చిన విక్రమ్ ల్యాండర్ జాబిల్లిపై హార్డ్ ల్యాండింగ్ కావడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ఈ హార్డ్ ల్యాండింగ్ కారణంగా విక్రమ్ ల్యాండర్‌కు భూమండలంతో సంబంధాలు తెగిపోయాయి. 
 
ఈ నేపథ్యంలో, విక్రమ్ ల్యాండర్ నుంచి సంకేతాలు అందుకోవడానికి గత కొన్నిరోజుల నుంచి ఇస్రో వర్గాలు శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి. చివరికి నాసా సహకారం కూడా తీసుకుంది. అయితే, విక్రమ్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఇక దానిపై ఆశలు వదిలేసుకున్నట్టేనన్న భావన కలుగుతోంది. 
 
ఇస్రో తాజా ప్రకటన కూడా అందుకు తగ్గట్టుగానే ఉంది. విక్రమ్ ల్యాండర్లో కదలికలు తెచ్చే ప్రయత్నాలు ఎంతకీ సఫలీకృతం కాని తరుణంలో, ఇప్పటివరకు తమకు మద్దతుగా నిలిచిన భారతీయులందరికీ కృతజ్ఞతలు అంటూ ఇస్రో ఓ ప్రకటన చేసింది. 'ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయుల ఆశలు, వారి స్వప్నాలే మాకు స్ఫూర్తి. మరింత ఉత్సాహంతో కొనసాగుతాం' అంటూ ఇస్రో ట్విట్టర్‌లో పేర్కొంది. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అల్లు అర్జున్ బ్లాక్‌బస్టర్ సరైనోడు 10వ వార్షికోత్సవం

ఎవరే’ పాట మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను : అంబటి అర్జున్

MS Raju: ఎమ్మెస్ రాజు అగధ లో‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

JD Chakravarthy: నచ్చకపోతే థియేటర్స్‌లోనే కాదు, ఓటీటీలో కూడా చూడరు : జేడీ చక్రవర్తి

SV Krishna Reddy: SV కృష్ణారెడ్డి వేదవ్యాస్ చిత్రం బేనర్ పూజకార్యక్రమాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

heat stroke వడదెబ్బ తగ్గేందుకు చిట్కాలు

ఎముక పుష్టి కోసం క్యాల్షియం వున్న ఆహార పదార్థాలు ఇవే

ఫస్ట్ లుక్: స్టెల్లా మెక్‌కార్ట్‌నీ హెచ్ అండ్ ఎం కలెక్షన్‌ని లాంచ్ చేసిన హెచ్ అండ్ ఎం

నాట్స్ ఆధ్వర్యంలో హైవే దత్తత కార్యక్రమం, సామాజిక సేవలో తెలుగు విద్యార్ధులు

Student: నెలసరిని ఆలస్యం చేసింది.. 18 ఏళ్ల యువతి మృతి

తర్వాతి కథనం
Show comments