అబ్బాయ్.. తితిదే చైర్మన్ పోస్ట్ మరో ఏడాది కావాలి, కుదరదులే బాబాయ్ అన్న జగన్?!!

Webdunia
గురువారం, 1 జులై 2021 (17:00 IST)
అబ్బాయి నాకు ఇచ్చిన పదవీకాలం ముగిసిపోతోంది. మరో సంవత్సరం పొడిగించు అంటూ సాక్షాత్తు వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వై.వి.సుబ్బారెడ్డి ప్రాధేయపడ్డట్లు సమాచారం. రెండు సంవత్సరాల కాలపరిమితి ముగిసింది. ఎక్కడ కూడా ఎలాంటి ఆరోపణలు రాలేదు. కాబట్టి నాకు అవకాశం కావాలని తాడేపల్లికి వెళ్ళి అడిగారట.
 
అయితే అదంతా పట్టించుకోని సిఎం టిటిడికి స్పెసిఫైడ్ అథారిటీని నియమించారు. పాలకమండలిని రద్దు చేసేశారు. దీంతో అలకపాన్పు ఎక్కిన వై.వి.సుబ్బారెడ్డి బెంగుళూరు నగరానికి వెళ్ళిపోయారట. బెంగుళూరులో జగన్ ఇంటికి సమీపంలోనే వై.వి.సుబ్బారెడ్డికి ఇల్లు ఉంది.
 
దీంతో ఆయన అక్కడకు వెళ్ళిపోయారట. ఎవరితోను మాట్లాడడం లేదట. తనను బుజ్జగించడానికి ఎవరైనా ప్రయత్నిస్తే సున్నితంగా తిరస్కరిస్తున్నారట వై.వి.సుబ్బారెడ్డి. విషయం కాస్త జగన్ దృష్టికి వెళ్ళినట్లు తెలుస్తోంది. అయితే పదవిని కొంతమందికి కొన్నిరోజులే ఉంటుందని ఇప్పటికే సిఎం ప్రకటించారు. అందులో భాగంగానే సొంతవారైనా, ఎవరైనా సరే ఇలాగే ఉంటుందని చెప్పడానికి జగన్ ఇలా చేశారంటూ వైసిపిలో ప్రచారం జరుగుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'బాహుబలి' రికార్డును బద్ధలు కొట్టిన 'ధురంధర్ : ది రివెంజ్'

Akhil: పెద్ది కోసం అఖిల్ చిత్రం లెనిన్ వాయిదా పడింది

Ramcharan: పెద్ది పహిల్వాన్ గ్లింప్స్ తో ఇండియా నెం.1 ట్రెండింగ్‌లో రామ్ చరణ్

Akshaye Khanna: మహాకాళి లో తన పోర్షన్ షూటింగ్ పూర్తి చేసుకున్న అక్షయ్ ఖన్నా

Biker: శర్వా 23 కేజీలు తగ్గారు - న్యూజీలాండ్, ఆస్త్రేలియా రేసర్స్ ని రప్పించాము : అభిలాష్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రవీనా టాండన్, రాషా థడానీలతో తల్లి-కూతుళ్ల నమ్మకాన్ని వేడుక చేసిన గార్నియర్ కలర్ నాచురల్స్

మహిళల్లో రుతుక్రమం ఎందుకు ఆలస్యం, ప్రధాన కారణాలు ఏమిటి?

పచ్చి కూరగాయల్లో తినకూడనివి ఏవి?

మోతాదుకి మించి గ్రీన్ టీ తాగితే...

సిప్లా నుంచి మసాలా జామ రుచితో ప్రోలైట్‌ ఓఆర్ఎస్‌ పోర్ట్‌ఫోలియో

తర్వాతి కథనం
Show comments