Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజాకు మళ్లీ మంత్రి పదవి జారిపోయినట్లేనా? ఆ పదవి ఖాయం చేస్తారట...

Webdunia
మంగళవారం, 21 జులై 2020 (18:23 IST)
వైసిపిలో ఫైర్ బ్రాండ్ రోజా. ప్రతిపక్ష పార్టీ నేతలను ఏకిపారేయడంలో ఆమెకు ఆమే సాటి. విమర్సలంటే రోజా చేస్తేనే అన్నవిధంగా పదునైన మాటలతో ఫైర్ బ్రాండ్‌గా మారిపోయారు రోజా. అలాంటి రోజాకు మొదటిసారి మంత్రివర్గ విస్తరణలో అవకాశం లభిస్తుందని అందరూ భావించారు.
 
తనకు మంత్రి పదవి గ్యారంటీ అని రోజా అనుకున్నారు. కానీ సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఆమెకు మంత్రి పదవి దక్కకుండా పోయింది. రోజా అలిగారని సిఎం ఇక ఎపిఐఐసి ఛైర్ పర్సన్ పదవి ఇచ్చారు. రెండవసారి మళ్ళీ మంత్రివర్గ విస్తరణ ప్రారంభం జరుగుతోంది.
 
ఈసారి రోజాకు మంత్రి పదవి పక్కా అన్నవారు లేకపోలేదు. ఆమె అభిమానులే బహిరంగంగా ఈ విషయాన్ని చెబుతూ వచ్చారు. కానీ మళ్ళీ మంత్రి పదవి చేజారిపోయినట్లే. అయితే రోజా సినీరంగం నుంచి వచ్చిన నేపథ్యంలో సినీరంగానికి సంబంధించి ప్రభుత్వం తరపున ఒక కమిటీని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆలోచనలో ఉన్నారట.
 
దీంతో ఆమెకు ఆ ఛైర్మన్ పదవిని అప్పగించాలని నిర్ణయానికి వచ్చారట. అంతేకాదు రోజా కింద ఒక ఐఎఎస్ అధికారి కూడా కమిటీలో పనిచేస్తారు. గతంలో ఏ ప్రభుత్వం సినీరంగం కోసం కమిటీని ఏర్పాటు చేయలేదు. కానీ ఈ కమిటీతో రోజా అలక తీర్చినట్లవుతుందని జగన్ ఆలోచిస్తున్నారట. మరి రోజా ఇందుకు ఒప్పుకుంటారా లేదా అన్నది ఆసక్తికరంగా మారుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హసన్ లాంచ్ చేసిన నవీన్ చంద్ర నటించిన లెవెన్ గ్రిప్పింగ్ ట్రైలర్

కిష్కింధపురి ఫస్ట్ గ్లింప్స్ లో కొన్ని తలుపులు తెరవడానికి వీలు లేదు

పహాల్గాం షూటింగ్ జ్ఞాపకాలు షేర్ చేసుకున్న హీరోయిన్ నభా నటేష్

వరుణ్ తేజ్‌చిత్రంలో ఐటెం సాంగ్ చేస్తున్న దక్ష నాగర్కర్ !

నేటి, రేపటి తరానికి కూడా ఆదర్శం పద్మభూషణ్ బాలకృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

తర్వాతి కథనం
Show comments