Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో తొలి మంకీపాక్స్ మృతి కేసు నమోదు

Webdunia
సోమవారం, 1 ఆగస్టు 2022 (08:53 IST)
దేశంలో తొలిసారి మంకీపాక్స్ మృతి కేసు నమోదైంది. యూఏఈలో ఉండగానే, మంకీపాక్స్ సోకిన యువకుడు అధికారులకు చెప్పలేదు. కేరళకు వచ్చాక ఆయనకు తీవ్ర జ్వరం, తలనొప్పి రావడంతో ఆస్పత్రిలో చేరాడు. అక్కడ జరిపిన వైద్య పరీక్షల్లో అతనికి మంకీపాక్స్ సోకినట్టు తేలింది. పైగా, చర్మంపై పుండ్లు, దద్దుర్లు వంటివి లక్షణాలు లేకపోవడంతో సాధారణ చికిత్స అందిస్తూ వచ్చారు. అయితే, ఆ యువకుడు మృతి చెందాడు. ఇది భారత్‌‌లో నమోదైన తొలి మంకీపాక్స్ కేసుగా నమోదైంది. 
 
ఈ యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందాడు. మృతుని వయసు 22 యేళ్లు. అయితే, ఈ విషయం ఆలస్యంగా తెలిసిందని కేరళ ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు అతడి నమూనాలను పరీక్షల కోసం పంపామని, మృతి కారణాలను విశ్లేషిస్తున్నామని తెలిపారు. ఇది మంకీపాక్స్ కారక మరణమేనని కేరళ ఆరోగ్య శాఖ అధికారికంగా ప్రకటించక పోయినప్పటికీ దేశంలో తొలి మంకీపాక్స్ మృతిగా పేర్కొంటున్నారు. 
 
మరోవైపు, ఈ మృతిపై కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ స్పందించారు. శనివారం మరణించిన యువకుడిలో మంకీపాక్స్ లక్షణాలు ఏవీ కనిపించలేదని ఆ యువకుడి మృతికి కారణాలను విశ్లేషిస్తున్నామని తెలిపారు. కోవిడ్ తరహాలో మంకీపాక్స్ ప్రాణాంతకం కాదని ఆమె తెలిపారు. ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తున్నప్పటికీ మరణాలు రేటు మాత్రం చాలా తక్కువగా ఉందని తెలిపారు. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments