Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో తొలి మంకీపాక్స్ మృతి కేసు నమోదు

Webdunia
సోమవారం, 1 ఆగస్టు 2022 (08:53 IST)
దేశంలో తొలిసారి మంకీపాక్స్ మృతి కేసు నమోదైంది. యూఏఈలో ఉండగానే, మంకీపాక్స్ సోకిన యువకుడు అధికారులకు చెప్పలేదు. కేరళకు వచ్చాక ఆయనకు తీవ్ర జ్వరం, తలనొప్పి రావడంతో ఆస్పత్రిలో చేరాడు. అక్కడ జరిపిన వైద్య పరీక్షల్లో అతనికి మంకీపాక్స్ సోకినట్టు తేలింది. పైగా, చర్మంపై పుండ్లు, దద్దుర్లు వంటివి లక్షణాలు లేకపోవడంతో సాధారణ చికిత్స అందిస్తూ వచ్చారు. అయితే, ఆ యువకుడు మృతి చెందాడు. ఇది భారత్‌‌లో నమోదైన తొలి మంకీపాక్స్ కేసుగా నమోదైంది. 
 
ఈ యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందాడు. మృతుని వయసు 22 యేళ్లు. అయితే, ఈ విషయం ఆలస్యంగా తెలిసిందని కేరళ ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు అతడి నమూనాలను పరీక్షల కోసం పంపామని, మృతి కారణాలను విశ్లేషిస్తున్నామని తెలిపారు. ఇది మంకీపాక్స్ కారక మరణమేనని కేరళ ఆరోగ్య శాఖ అధికారికంగా ప్రకటించక పోయినప్పటికీ దేశంలో తొలి మంకీపాక్స్ మృతిగా పేర్కొంటున్నారు. 
 
మరోవైపు, ఈ మృతిపై కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ స్పందించారు. శనివారం మరణించిన యువకుడిలో మంకీపాక్స్ లక్షణాలు ఏవీ కనిపించలేదని ఆ యువకుడి మృతికి కారణాలను విశ్లేషిస్తున్నామని తెలిపారు. కోవిడ్ తరహాలో మంకీపాక్స్ ప్రాణాంతకం కాదని ఆమె తెలిపారు. ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తున్నప్పటికీ మరణాలు రేటు మాత్రం చాలా తక్కువగా ఉందని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments