Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో ఫస్ట్ టైమ్ - అయినా భయం లేదంటున్న వైద్య నిపుణులు..

Webdunia
శుక్రవారం, 20 మే 2022 (08:49 IST)
హైదరాబాద్ నగరంలో సరికొత్త వైరస్ వెలుగు చూసింది. ఒమిక్రాన్ సబ్ వేరియంట్‌గా దీన్ని గుర్తించారు. ఈ తరహా వైరస్ మన దేశంలో వెలుగు చూడటం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ నెల 9వ తేదీన ఈ కేసు వెలుగు చూసినప్పటికీ ఒమిక్రాన్ అంత ప్రమాదకారికాదని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 
 
మరోవైపు, ఈ సబ్ వేరియంట్ కరోనా సోకిన వారికి, రెండు డోసులు వేయించుకున్న వారికి సోకుతుందని ఆరోగ్య నిపుణులు వెల్లడించారు. ఆస్పత్రిలో చేరేంత ప్రమాదం ఉండదని స్పష్టం చేశారు. కానీ, ఈ వేరియంట్ వ్యాప్తి అధికంగా ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. 
 
ఈ వేరియంట్ మరిన్ని నగరాలకు కూడా వ్యాప్తి చెందే అవకాశం ఉందని భారత వైద్య పరిశోధనా మండలి తెలిపింది. అయితే, భారత్‌లో ఒమిక్రాన్ వేరియంట్ ఇప్పటికే వ్యాపించడం, దీనికితోడు వ్యాక్సినేషన్ కార్యక్రమం విస్తృతంగా జరగడం వల్ల తాజా వేరియంట్ బీఏ.4 ప్రభావం అంతగా ఉండకపోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 
 
కేసులు పెరిగినా ఉధృత్తి మాత్రం తక్కువగా ఉంటుందని అంటున్నారు. ముఖ్యంగా ఈ వేరియంట్ బారినపడిన బాధితులు ఆస్పత్రుల్లో చేరే పరిస్థితులు ఉండవని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ తెలిపింది. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments