Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లోకి ఒమిక్రాన్ వేరియంట్ ఎంట్రీ : నిర్ధారించిన కేంద్ర ఆరోగ్య శాఖ

Webdunia
గురువారం, 2 డిశెంబరు 2021 (19:59 IST)
ఆఫ్రికా దేశాల్లో పురుడు పోసుకుని ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ కొత్త వేరియంట్ అయిన ఒమిక్రాన్ వైరస్ భారత్‌లోకి ప్రవేశించినట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. భారత్‌లో ఇప్పటివరకు రెండు కేసులను గుర్తించినట్టు తెలిపింది. ఈ రెండు కేసులు కూడా కర్నాటక రాష్ట్రంలోనే నమోదయ్యాయి. వీరిలో ఒకరు విదేశీ పౌరుడు. ఈ ఇద్దరు రోగుల వయస్సు 44 యేళ్లు, 66 యేళ్లుగా ఉన్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ అధికారికంగా ప్రకటించింది. మరో ఇద్దరి కరోనా పాజిటివ్ రోగుల శాంపిల్స్‌ను జీనోమ్ సీక్వెన్సెస్‌కు పంపించారు. 
 
మరోవైపు, ఒమిక్రాన్ వేరియంట్ వెలుగు చూసిన సౌతాఫ్రికాలో కొత్తగా నమోదవుతున్న కేసులు భయపెడుతున్నాయి. ఒక్క రోజులోనే ఈ కేసుల సంఖ్య రెట్టింపు కావడం మరింత ఆందోళనకు గురిచేస్తుంది. సౌతాఫ్రికాలో మంగళవారం 4373 కేసులు ఉండగా, బుధవారం నాటికి ఈ కేసుల సంఖ్య 8561కి చేరుకుంది. ఈ కేసుల సంఖ్యను పరిశీలించిన సౌతాఫ్రికా శాస్త్రవేత్తలు.. దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి శరవేగంగా సాగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments