Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్ - చైనాల మధ్య యుద్ధ ఘర్షణ - డ్రాగన్ సైనికుల మృత్యువాత?

Webdunia
మంగళవారం, 16 జూన్ 2020 (17:19 IST)
భారత్ చైనాల మధ్య యుద్ధ ఘర్షణ నెలకొంది. ఇరు దేశాలకు చెందిన సైనికులు గత రాత్రి లడఖ్ సరిహద్దుల్లో తలపడ్డారు. ఒకరిపై ఒకరు రాళ్ళతో దాడి చేసుకున్నారు. ఈ దాడిలో ముగ్గురు భారత సైనికులు ప్రాణాలు కోల్పోయినట్టు వార్తలు వచ్చాయి. అయితే, ఈ ఘటనపై రెండు వైపులా ప్రాణనష్టం జరిగిందని భారత ఆర్మీ చెబుతోంది. ముగ్గురు చైనా సైనికులు మరణించారని పేర్కొంది. 
 
అయితే, చైనా మీడియా సంస్థ 'గ్లోబల్ టైమ్స్' భిన్నవాదనలు వినిపిస్తోంది. లడఖ్ వద్ద గాల్వన్ లోయలో జరిగిన ఘర్షణలో ఐదుగురు చైనా సైనికులు మరణించారని, 11 మందికి గాయాలయ్యాయని ఓ కథనంలో పేర్కొంది. 'గ్లోబల్ టైమ్స్' సోషల్ మీడియాలోనూ ఇదే విషయాన్ని ప్రచారం చేస్తోంది. అయితే ఈ విషయం అధికారికంగా ఎక్కడా వెల్లడి కాలేదని కూడా ఆ మీడియా సంస్థ తెలిపింది.
 
వాస్తవానికి లడఖ్ వద్ద కొన్ని వారాలుగా భారత్, చైనా సైనికుల మధ్య ఘర్షణ పూరిత వాతావరణం నెలకొనివున్న విషయం తెల్సిందే. ఇరుదేశాల ఉన్నతస్థాయి సైనికాధికారులు చర్చలు జరిపినా లడఖ్ వద్ద పరిస్థితులు చక్కబడలేదు సరికదా, గతరాత్రి జరిగిన దాడి ఘటనతో మరింత వేడెక్కాయి. గాల్వన్ లోయ వద్ద జరిగిన దాడి ఘటనపై భారత ఆర్మీ స్పందించింది.
 
గత రాత్రి ఇరుదేశాల సైనికుల మధ్య ఘర్షణ జరిగిందని, భారత్, చైనా సైనికులు పరస్పరం రాళ్లతో కొట్టుకున్నారని వెల్లడించింది. ఈ దాడిలో ఓ సైనికాధికారి, మరో ఇద్దరు జవాన్లను భారత్ కోల్పోయిందని, అటు చైనా సైనికులు ముగ్గురు ప్రాణాలు కోల్పోయారని వివరించింది. మన సైనికులు సంయమనం పాటించినా తొలుత చైనా సైనికులే రెచ్చగొట్టారని భారత ఆర్మీ ఆరోపించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

Chiru: 25 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సంతకం తీసుకున్న శేఖర్ కమ్ముల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments